ఐపీఎల్ ఫైన‌ల్లో ఆప‌రేష‌న్ సింధూర్‌కు నివాళి...

ఐపీఎల్ ఫైన‌ల్లో ఆప‌రేష‌న్ సింధూర్‌కు నివాళి...

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫైనల్ జూన్ 3న అహ్మదాబాద్‌లో జరగనుంది. ఈ సందర్భంగా త్రివిధ దళాధిపతులను ఆహ్వానించినట్టు బీసీసీఐ వెల్లడించింది. ఇటీవల పెహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత రక్షణ దళాలు చేపట్టిన "ఆపరేషన్ సింధూర్" విజయవంతమైన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్‌లో పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశారు. ఆ సమయంలో ఐపీఎల్ మ్యాచ్‌లను కూడా రద్దు చేసిన విషయం తెలిసిందే.ఇప్పుడు ఐపీఎల్ ప్లే ఆఫ్స్ దశ ప్రారంభం కానుంది. ఇవాళ తుది లీగ్ మ్యాచ్ జరుగుతుంది. గురువారం "క్వాలిఫయర్ 1" మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా ఆపరేషన్ సింధూర్‌లో చూపిన సాహసం, ధైర్యానికి నివాళిగా బీసీసీఐ ఓ ప్రత్యేక కార్యక్రమం చేపట్టనుంది.ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లకు చెందిన టాప్ అధికారులను మరియు సైనికులను ఐపీఎల్ ఫైనల్‌కు ఆహ్వానించింది. ఆపరేషన్ సింధూర్ విజయాన్ని సెలబ్రేట్ చేయడమే లక్ష్యంగా ఉన్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ నివాళి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ నివాళి
న్యూఢిల్లీ: తెలుగు సినీ దిగ్గజం, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఎన్టీఆర్‌ను...
రాజ్యసభకు కమల్ హాసన్! 
ప్రైవేట్ హెలికాప్టర్ల తయారీకి భారత్‌లో నూతన అధ్యాయం – కర్ణాటకలో తొలి కేంద్రం
ఎన్టీఆర్ ఓ యుగ పురుషుడు, ఆయనకు భారత రత్న పురస్కారం ఇవ్వాలి
కొల్లూరు వెళ్లడానికి బస్సు సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు
పద్మపురస్కారాలను అందుకున్న ప్రముఖులు
క్షమాగుణం మెరుగైన