నేత్రదాన ప్రచార కనోపి ఆవిష్కరణ.

నేత్రదాన ప్రచార కనోపి ఆవిష్కరణ.

నల్లగొండ:

లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఐ డొనేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం ద్వారా ఇప్పటివరకు 122 మంది నేత్రదాతల ద్వారా 244 కార్నియా అను కంటి పొరలను సేకరించి, 244 మందికి పైగా కార్నియా అంధులకు కంటిచూపును ప్రసాదించగలిగామని ఐ డొనేషన్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హరినాథ్ తెలిపారు. మూడు పార్థివ దేహాలను వారి కుటుంబ సభ్యులు అనుమతితో నల్గొండ ప్రభుత్వాసుపత్రికి అందించి వైద్య విద్యార్థులకు ఉపయోగపడే పడగలిగామని అయితే ఈ నేత్రదాన ఉద్యమాన్ని అందరికీ చేరవేయటంలో భాగంగా, రాష్ట్రంలోనే ప్రప్రధమంగా "నేత్రదాన అవగాహన కనోపి" ను ఏర్పాటు చేశామని  తెలిపారు.ఇటువంటి "నేత్రదాన అవగాహన కనోపి" ఏర్పాటు చేసి నేత్రదానం , అవయవదానం యొక్క ప్రాముఖ్యతను వేలాది మందికి తెలియజేయడం ద్వారా వీరు చేస్తున్న కార్యక్రమము ఎంతో గొప్పదని "కనోపి" నీ ప్రారంభించిన ముఖ్య అతిథి హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ - రాజ్ కుమార్  తెలుపుతూ ఈ శిబిరంలో ఉచితంగా షుగర్ పరీక్షలు బీపీ పరీక్షలు చేయడం ఎంతో గొప్ప విషయమని, ప్రస్తుతము మన సమాజంలో అవయవదాతల కోసం ఎన్నో కుటుంబాలు ఎదురుచూస్తున్నాయని అలానే కార్నియా కంటిపొరల కొరకు లక్షలాదిమంది అంధులు ఎదురు చూస్తున్నారని వీరికి సహాయం చేయడంలో భాగంగా లయన్స్ క్లబ్ వారి సేవలను అందరూ వినియోగించుకోవాలని కోరారు. మరణానంతరం 6 నుండి 8 గంటలలోగా నేత్రదానం చేయించాలని, పార్థివ దేహాన్ని ఫ్రీజర్ బాక్స్ లో ఉంచినట్లయితే 12 నుంచి 15 గంటల లోగా నేత్రదానం చేయించవచ్చని, మనదేశంలో 13 లక్షల మంది కార్నియా అంధులు, ఈ కంటిపొరల కొరకు ఎదురుచూస్తున్నారని అలానే వేలాది మంది పేషెంట్లు వివిధ రకాల అవయవాల దాతల కొరకు ఎదురుచూస్తున్నారని, వీరికి సహాయం చేయుటకు అందరూ ముందుకు రావాలని, ఐ డొనేషన్ సెంటర్ మేనేజర్ డాక్టర్ పుల్లారావు తెలిపారు.

ఈ శిబిరంలో 90 మందికి రక్తపోటు మరియు షుగర్ పరీక్షలను నిర్వహించామని తమ ఆధ్వర్యంలో చేపట్టిన నేత్రదాన ఉద్యమాన్ని ప్రచారం చేయడంలో భాగంగా తమ కాలనీలు, అపార్ట్మెంట్లలో, సమావేశాలు, సభలు జరుగుతున్నప్పుడు, కళాశాలలు, కాలేజీలు అన్ని రకాల అసోసియేషన్లు, గుడి, మసీద్, చర్చి ప్రాంగణాలు, గ్రామాలలో, వ్యాపార సముదాయాలు మొదలగు ప్రాంతాలలో నేత్రదాన అవగాహన కార్యక్రమాలు చేపట్టడం కొరకు తమ కోఆర్డినేటర్ "చంద్రశేఖర్ చిరునోముల" ను 9948143299 ఫోన్ నెంబర్ కు సంప్రదించాలని చైర్మన్ అడ్వకేట్ కెవి ప్రసాద్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ - డాక్టర్ దామర యాదయ్య, డాక్టర్ సుబ్బారావు, డాక్టర్ ఇమాన్యుల్, డాక్టర్ నితీష, డాక్టర్ ప్రనూష, బండారు ప్రసాద్, శవరయ్య, భీమార్జున్ రెడ్డి, చింతపల్లి వెంకన్న, గుండబోయిన లింగయ్య, శంకర్ రెడ్డి, సైదులు, నిమ్మల పిచ్చయ్య, అశోక్ ఎర్రమాద, కొంగరి బిక్షం, బచ్చల కూర జానీ తదితరులు పాల్గొని నిర్వాహకులను అభినందించారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఇవి ఉడకబెట్టి  తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా....... ఇవి ఉడకబెట్టి తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా.......
పండుగలు లేదా శుభ కార్యాల సమయంలో చాలా మంది ప్రత్యేకంగా గారెలు తయారుచేస్తుంటారు. మొక్కజొన్న, బొబ్బర్లు, పెసలు, మినుములు వంటివి ఉపయోగించి గారెలను వేస్తారు. కొన్ని ప్రాంతాల్లో...
పదవి విరమణ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది 
బీజేపీ నాయకుల ర్యాలీ 
పొగాకు కు దూరంగా ఉండండి-ఆరోగ్యంగా జీవించండి 
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను చేయాలి 
వరిధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి
జూన్ రెండో వారం నుంచి విస్తారంగా వ‌ర్షాలు........