మీకు పాదాల వాపులు ఉన్నాయా..?

మీకు పాదాల వాపులు ఉన్నాయా..?

వయస్సు పెరిగే కొద్ది అనేక అనారోగ్య సమస్యలు రావడం సహజం. వాటిలో పాదాల వాపు లేదా "ఎడిమా" కూడా ఒకటి. ఈ సమస్యలో పాదాలు వాపు చెంది, వేలితో నొక్కితే సొట్ట పడుతుంది. ఇది సాధారణంగా పాదాలలో నీరు నిలిచిపోవడం వల్ల జరుగుతుంది. ఈ సమస్య కేవలం వయసువృద్ధుల్లోనే కాదు, ఆధునిక జీవనశైలిలో చాలా మందిలో కనిపిస్తోంది.

ఉద్యోగ కారణంగా ఎక్కువసేపు కూర్చుని లేదా నిలబడి ఉండే వారు, గర్భిణీలు, అధిక బరువుతో ఉన్నవారు, ఎక్కువగా ఉప్పు తీసుకునేవారు, కొన్ని రకాల మందులు తరచుగా వాడేవారు, వేడి వాతావరణంలో ఎక్కువసేపు ఉండేవారు, లేదా మహిళలు రుతుక్రమ సమయంలో ఈ సమస్యను ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త:

పాదాల వాపుతో పాటు ఎరుపుదనం, దురద, శ్వాస సమస్యలు లేదా చర్మం రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. లేకపోతే ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయొచ్చు. సాధారణ వాపులు అయితే ఇంటి చిట్కాలతో తగ్గించుకోవచ్చు.
ఇంటి చిట్కాలు & జాగ్రత్తలు:

    పాదాల కింద దిండును ఎత్తుగా పెట్టి విశ్రాంతి తీసుకోవాలి.

    ప్రతి 30 నిమిషాలకు 5 నిమిషాల బ్రేక్ తీసుకోవడం మంచిది.

    నిలబడే వారు ఎంత మాత్రం వీలైతే కూర్చునే ప్రయత్నం చేయాలి.

గోరు వెచ్చటి నీటిలో ఎప్సమ్ సాల్ట్:

సగం బకెట్‌లో గోరువెచ్చటి నీటిలో కాస్త ఎప్సమ్ సాల్ట్ కలిపి, 15-20 నిమిషాల పాటు పాదాలు మునిగించి ఉంచితే వాపు, నొప్పి తగ్గుతుంది. అయితే డయాబెటిస్ ఉన్నవారు లేదా పాదాల్లో పుండ్లు ఉన్నవారు ఈ పద్ధతిని తప్పుకోవాలి.
కంప్రెషన్ సాక్స్:

మెడికల్ స్టోర్లలో దొరికే కంప్రెషన్ సాక్స్ వాడటం ద్వారా కూడా ఉపశమనాన్ని పొందవచ్చు.
ఆహార అలవాట్లు:

    ఉప్పు వినియోగాన్ని గణనీయంగా తగ్గించాలి. సోడియం ఎక్కువైతే శరీరంలో నీరు నిలిచిపోతుంది.

    నీరు తరచూ తాగాలి.

    తేలికపాటి వ్యాయామం చేయాలి – ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

    కీరదోస, పుచ్చకాయ, కొత్తిమీర రసం, అల్లం రసం, స్ట్రాబెర్రీ, చెర్రీ వంటి ఫలాలు, విటమిన్ C అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి.

    యాపిల్ సైడర్ వెనిగర్: 1 టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్‌ను ఒక గ్లాస్ గోరువెచ్చటి నీటిలో కలిపి రోజుకు ఒకటి లేదా రెండు సార్లు తాగితే వాపు తగ్గుతుంది. అయితే దంతాల ఎనామెల్‌ను కాపాడేందుకు స్ట్రా ఉపయోగించాలి.

ఈ సూచనలు పాటిస్తూ, అవసరమైతే వైద్యుడి సలహా తీసుకుంటూ, పాదాల వాపు సమస్యను ప్రభావవంతంగా తగ్గించుకోవచ్చు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

రెవంత్ రెడ్డి సర్కార్‌ తొలి గద్దర్ సినీ అవార్డులు అందించేందుకు సిద్ధం రెవంత్ రెడ్డి సర్కార్‌ తొలి గద్దర్ సినీ అవార్డులు అందించేందుకు సిద్ధం
2024 జనవరిలో సినీ పరిశ్రమకు సంబంధించిన నంది అవార్డులను రద్దు చేసి, బల్లాడీర్ గద్దర్ గారి పేరుతో ప్రతీ ఏటా ఆయన జయంతి సందర్భంగా గద్దర్ అవార్డులను...
మ‌రోసారి ఏఐజీ ఆసుప‌త్రికి మాజీ సీఎం కేసీఆర్
రేపటి నుండి కెనడాలో జీ7 సదస్సు.. హాజరుకానున్న ప్రధాని మోదీ
భారత్‌లో 7,400కు చేరిన కరోనా యాక్టివ్‌ కేసులు… 87కు చేరిన మరణాలు
రాత్రి పూట భోజ‌నం అనంత‌రం 10 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే.. ఇన్ని లాభాల.....
ఉప్పల్‌లో భారత్‌, న్యూజిలాండ్‌ టీ20 మ్యాచు!
కుమారుడి అడ్మీష‌న్ కోసం ఇక్రిశాట్‌కి వెళ్లిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌