ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి......

ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి......

- ప్రతి ఒక్క రైతు ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు చేసుకోవాలి.

- ఫార్మర్ రిజిస్ట్రి చేసుకోకపోతే కేంద్ర ప్రభుత్వ పథకాలు వర్తించవు.

- పెద్దేముల్ మండల వ్యవసాయ అధికారి పవన్ ప్రీతం.
లోకల్ గైడ్/ తాండూర్: 
పెద్దేముల్ మండల వ్యాప్తంగా ఉన్న రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రీ తప్పకుండా నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి పవన్ ప్రీతం తెలిపారు.కేంద్ర ప్రభుత్వం.. దేశంలోని రైతులందరికీ కోసం నూతనంగా ఫార్మర్ రిజిస్ట్రీ ని అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫార్మర్ రిజిస్ట్రీ ద్వారా రైతులందరికీ ఆధార్ కార్డు రూపంలో 14 అంకెలతో కూడిన... విశిష్ట సంఖ్యను కేటాయించనున్నారు. దీనిని యూనిట్ ఫార్మర్ ఐడి అని పిలుస్తారు. దీని ద్వారా రైతులకు సంబంధించిన అన్ని వివరాలు డిజిటల్ రూపంలో ఒక దగ్గర భద్రపరుస్తారు. రైతులకు సంబంధించిన పథకాల అమలును మరింత సమర్థవంతంగా నిర్వహించాలనే ముఖ్య ఉద్దేశంతో, ఈ ప్రాజెక్టును రూపొందించినట్లు వ్యవసాయ అధికారి పవన్ ప్రీతం వెల్లడించారు. ఇప్పటివరకు మండల వ్యాప్తంగా సుమారు14,228 మంది రైతులు ఉండగా, కేవలం1,492 మంది రైతులు మాత్రమే ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు చేసుకున్నట్లు ఆయన తెలిపారు.భూమి ఉండి పట్ట పాస్ బుక్ కలిగిన ప్రతి రైతు దీనిని నమోదు చేసుకోవాలని, లేనియెడల భవిష్యత్తులో కేంద్రం నుంచి విడుదలయ్యే పథకాలకు అనర్హులు అవుతారని స్పష్టం చేశారు.ఈ ఫార్మార్ రిజిస్ట్రీ చేసుకోవడం ద్వారా, కేంద్రం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు నేరుగా రైతుల ఖాతాలోకే వస్తాయని ఆయన అన్నారు.కాబట్టి మండల వ్యాప్తంగా ఉన్న పట్టా పాస్ బుక్ కలిగిన రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. 

ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు చేసుకునే విధానం: 
రైతులు తమ దగ్గర ఉన్న పట్టా పాస్ బుక్, ఆధార్ కార్డు, ఆధార్ కార్డుకు లింకు చేసినటువంటి ఫోన్ నెంబర్ ను తమ వెంట తీసుకొని మండల కేంద్రంలో ఉన్న రైతు వేదికలో వ్యవసాయ విస్తరణ అధికారులకు సంబంధిత పత్రాలను సమర్పించాలని ఆయన తెలిపారు. అనంతరం వాటిని నమోదు చేసిన వెంటనే 11 అంకెలతో కూడిన రైతు విశిష్ట సంఖ్య రావడం జరుగుతుంది. దీనిని రైతులు భద్రపరుచుకోవాలని అన్నారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలు పొందాలంటే రిజిస్ట్రీ తప్పనిసరి.
కేంద్ర ప్రభుత్వం యావత్ దేశంలో ఉన్న ప్రతి రైతు సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్మర్ రిజిస్ట్రీని అందుబాటులోకి తెచ్చింది. ఇది భవిష్యత్తులో వివిధ సంక్షేమ పథకాలకు కీలకం కానున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న... ఫసల్ బీమా యోజన, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, నిధులు విడుదల కావాలంటే... రాబోయే రోజులలో రైతు విశిష్ట సంఖ్య తప్పనిసరి అవుతుందని స్పష్టం చేశారు. అంతేకాకుండా పంటల భీమా, సబ్సిడీలు, మౌలిక వసతుల కల్పన వంటి వాటిని సమర్థవంతంగా అమలు చేయాలంటే రైతుల యొక్క వివరాలు కచ్చితంగా అవసరం అవుతాయి. కావున  వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని, ఈ ఫార్మర్ రిజిస్ట్రీ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మండల వ్యవసాయ అధికారి పవన్ ప్రీతం స్పష్టికరించారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన
-క్యాన్సర్, జనరల్ సర్జరీలు, యూరాలజీ, గైనకాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ
చిరువ్యాపారులకు భరోసా ఇచ్చిన మహేశ్వరం నియోజకవర్గం
ఎరుపు లేదా తెలుపు..? ఏ రంగు ఉల్లిపాయ తినితే ఆరోగ్యానికి ఎక్కువ మేలు?
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను కలసిన ఝాన్సీ రాజేందర్ రెడ్డి
వికాస తరంగిణి సభ్యులకు యోగా పై అవగాహన.....
బడిబాటలో భాగంగా జెడ్పిహెస్ ఓబులకేశ్వపూర్ ను సందర్శించిన జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ దర్శనం భొజన్న
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యం - డీఈఓ రమేష్ కుమార్