రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది
- రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు
- వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య
వరంగల్ జిల్లా (లోకల్ గైడ్ తెలంగాణ ): వర్ధన్నపేట మండలంలోని రామోజీ కుమ్మారి గూడెం తండా గ్రామములో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యాసంగి దాన్యం కొనుగోలు కేంద్రంను శుక్రవారం రోజున వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య ప్రారంభించారు.ఈ సందర్భంగా చైర్మన్ వెంకటయ్య మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధరతో పాటు, సన్నాలకు బోనస్ కూడా పొందాలని రైతులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటుచేయబడిన ఐకెపి కొనుగోలు కేంద్రాల్లో క్వింటాలుకు దొడ్డు రకం ధాన్యానికి 2300, సన్న రకం ధాన్యానికి 2300 తో పాటు క్వింటాలుకు 500/- బోనస్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది అని తెలిపారు. రైతులెవ్వరు మధ్యదళారులకు అమ్ముకోని మోసపోవద్దని, ఐకెపి కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం అమ్ముకోవాలని సూచించారు. ఐకెపి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తేమశాతం 17% ఉండే విధంగా చూడాలని అలాగే 41 కేజీలతో మాత్రమే రైతుల నుంచి ఐకెపి కొనుగోలుదారులు కాంటాలు నిర్వహించాలని సూచించారు. 41 కేజీల కంటే అధిక తూకంతో కాంటాలు నిర్వహించిన వారిపై చర్యలు తీసుకుంటామని నిర్వాహకులను హెచ్చరించారు .రైతులు ధాన్యం విక్రయించిన అనంతరం వాటిని తడవకుండా చూసుకునే బాధ్యత ఐకెపి కొనుగోలుదారులదేనని అన్నారు. అదేవిధంగా ఖరీదు చేయబడిన ధాన్యాన్ని ఐకెపి కేంద్రాలు ఎప్పటికప్పుడు లిఫ్ట్ చేసి గోదాములకు, మిల్లులకు తరలించాలని సూచించారు. అదేవిధంగా కొనుగోలు కేంద్రాల వద్ద మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయాలని సూచించారు.రాష్ట్రంలోని 43 లక్షల మంది రైతులకు 22 వేల కోట్ల రూపాయలతో 2 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీని చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. రాష్ట్రంలో ఉన్న 90 లక్షల తెల్ల రేషన్ కార్డు కుటుంబాలకు చౌక ధరల దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై మూడు వేల కోట్ల రూపాయల భారం పడుతుంది. అయినను పేదలకు సన్న బియ్యం పంపిణీ చేయడం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు.ఈ కార్యక్రమములో వర్ధన్నపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పోషాల వెంకన్న గౌడ్,కాంగ్రెస్ పార్టీ బిసి సెల్ జిల్లా కార్యదర్శి గజ్జెల సదయ్య, కట్ర్యాల దేవస్థానం చైర్మన్ కట్ట వెంకటయ్య, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు కుల్ల యాకాంతం, మహిళ మండల నాయకురాలు తీగల సునీత గౌడ్,గ్రామాల పార్టీ అధ్యక్షులు ఉప్పునూతుల రాములు,బండారి సతీష్ గౌడ్,మాజీ సర్పంచ్ భూక్యా మంగ్య ,మాజీ సొసైటి డైరెక్టర్ భూక్యా మల్లు నాయక్, నాయకులు భూక్యా శంకర్ నాయక్,భూక్యా చిన్న శంకర్,రైతులు తదితరులు పాల్గొన్నారు.
Comment List