ప్రమాదవశాత్తు గడ్డిలోడుతో వెళ్తున్న ట్రాక్టర్ దగ్ధం
- దాదాపు ఐదు లక్షల విలువచేసే ట్రాక్టర్ తో పాటు 15 వేల వరిగడ్డి పూర్తిగా దగ్ధమైనాయి
By Ram Reddy
On
వరంగల్ జిల్లా (లోకల్ గైడ్ ) : వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారు కట్ర్యాల కొత్తపల్లి రోడ్డు పై ట్రాక్టర్లో తరలిస్తున్న వరి గడ్డివాము కు ప్రమాదవశాత్తు అంటుకున్న మంటలు గడ్డివాముతో పాటు దగ్దం అయిన ట్రాక్టర్ ప్రమాదాన్ని గ్రహించి తప్పించుకున్న డ్రైవర్, సహాయకులు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.ప్రమాద స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే ట్రాక్టర్ తో పాటు గడ్డి పూర్తిగా దగ్ధమైనది. సుమారు 15 వేల రూపాయల విలువచేసే వరిగడ్డి, ఐదు లక్షల విలువ చేసే ట్రాక్టర్ దగ్ధమైనాయి. వర్ధన్నపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైతును, ట్రాక్టర్ ఓనర్ ను ప్రభుత్వపరంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
05 May 2025 17:48:28
వికారాబాద్ : లోకల్ గైడ్ : వికారాబాద్ బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గోపాల్ గారి ఆధ్వర్యంలో సబితా ఇంద్రారెడ్డి గారి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం...
Comment List