ఫ్యామిలీస్తో ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం 'డ్రాగన్' అనే టైటిల్తో ప్రచారంలో ఉంది. ఇప్పటివరకు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమా బాక్సాఫీస్ను షేక్ చేసింది. ముఖ్యంగా 'సలార్' తో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన ఆయన, ఇప్పుడు ఎన్టీఆర్తో కలిసి మరో మాస్ ఎంటర్టైనర్ తీస్తున్నారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇటీవల ఎన్టీఆర్ షూటింగ్లో జాయిన్ అయ్యినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాస్ పల్స్కు తగ్గట్టుగానే భారీ యాక్షన్ సన్నివేశాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. కర్ణాటకలో ఎన్టీఆర్పై ఓ కీలక యాక్షన్ సీన్ చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, షూటింగ్కు తాత్కాలిక బ్రేక్ వచ్చిన సమయంలో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ తమ ఫ్యామిలీలతో కలిసి చిలౌట్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రశాంత్ నీల్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఈ ఫోటోల్ని చూసి అభిమానులు, నెటిజన్లు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఎప్పుడూ ఎంటర్టైన్ చేసే ఎన్టీఆర్ అక్కడ కూడా ఏదో జోక్ వేసినట్టుగా కనిపించగా, ఆ జోక్కి అందరూ తెగ నవ్వేసారు.
Comment List