మాయమైపోతున్న గుట్టలు.
- మట్టి మాపియకు కరిగిపోతున్న మట్టి గుట్టలు.
- పట్టించుకోనీ సంబంధిత అధికారులు.
- ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి.
లోకల్ గైడ్/తాండూర్:
పెద్దేముల్ మండలములో మట్టి మాపీయ ఆగడాలకు గుట్టలు కరిగి పోతున్నాయి. అక్రమ తవ్వకాలతో సహజసిద్ధంగా వెలసిన గుట్టలు రోజురోజుకు కనుమరుగవుతున్నాయి. గుట్టలను తవ్వి, మట్టిని...ఇల్లు, రోడ్లు, వెంచర్లకు మట్టిని తరలిస్తూ వ్యాపారాలు,కాంట్రాక్టర్లు సొమ్ము చేసుకుంటున్నారు.గతంలో ఎక్కడ చూసినా కొండలు గుట్టలు ఎత్తైన ప్రదేశాలుగా కనిపించేయి.మట్టి మాఫియా ఆగడాలకు కొండలు సైతం పూర్తిగా కరిగిపోతున్నాయి.దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతున్నట్లు మండల ప్రజలు మాట్లాడుకుంటున్నారు.ఇంత జరుగుతున్నా, సంబంధిత అధికారులు మాత్రం తమకు తెలియనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.ఈ మట్టి మాఫియా ద్వారా మండల పరిధిలో ఎక్కడ చూసిన గుంతలు, లోయలు మాదిరిగా దర్శనమిస్తున్నాయి. దీనికి ఉదాహరణ పెద్దేముల్ మండల పరిధిలోని ఘాజీపూర్ గ్రామ శివారులో రాత్రి వేళలో యదేచ్చగా మట్టిని తరలిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు నిఘా వుంచి మట్టి మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని మండల ప్రజలు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.