పేదలకు అండగా ఇందిరమ్మ ఇండ్లు.
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం .
నల్లగొండ (లోకల్ గైడ్)
కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అండగా ఇందిరమ్మ ఇండ్లు కట్టేస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శుక్రవారం నకిరేకల్ మండలంలోని మండలాపురం గ్రామంలో 45 మంది లబ్ధిదారుల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు . ఈ సందర్భంగా
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నియెజకవర్గం కి 3500 ఇందిరమ్మ ఇండ్లలను మంజూరు చేశారన్నారు..గడిచిన ప్రభుత్వంలో ఎలాంటి ఇండ్ల ఇవ్వలేదు అన్నారు.ఆనాడు రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లలను ఇచ్చారు అన్నారు. మళ్లీ నేడు ఇందిరమ్మ ఇండ్లలను ఇస్తున్నాం అన్నాను.ఇండ్లు లేని ప్రతి పేదవాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తాం అన్నారు.విడుతల వారిగా లభ్దిదారులను ఎంపిక చేస్తాం అన్నారు.22 తారీఖున 3500 మందికి లభ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు పంపిణీ చేస్తాం అన్నారు.గడిచిన ప్రభుత్వంలో 8 లక్షల కోట్లు అప్పు చేశారు అన్నారు.మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, రైతు రుణమాఫీ, ఉచిత బస్సు, 500లకే గ్యాస్ సిలిండర్, 200 యునిట్ కరెంట్ ఇస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.