మత్తు పదార్థాల వలన యువత భవిష్యత్తు క్షీణిస్తుంది.
డ్రగ్స్ నిర్మూలనపై సామూహిక పోరాటం అవసరం.
ఏ కే ఫౌండేషన్ చైర్మన్, హైకోర్టు న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్
నల్లగొండ .లోకల్ గైడ్.
హాలియా పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక సి ఐ సతీష్ రెడ్డి , ఎస్ ఐ సాయి ప్రశాంత్ నిర్వహించిన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని ర్యాలీ అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోలీస్ శాఖ వారి ఆహ్వానమేరకు “ఏ.కే ఫౌండేషన్ చైర్మన్ హైకోర్టు న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్ అతిథిగా పాల్గొని ప్రసంగించారు”*ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాల వలన యువత భవిష్యత్తు క్షీణిస్తోందని, ఈ బానిసత్వం నుంచి వారిని బయటపడేసేందుకు సమాజం అంతా కలిసి పని చేయాలన్నారు. డ్రగ్స్, మద్యం, ఇతర వ్యసనాలపై పోరాటం జరగాల్సిన అవసరం ఉందని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో ఇది కీలకమైందని ఆయన పేర్కొన్నారు. ఏకే ఫౌండేషన్ తరఫున మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామాని తెలియజేశారు.