హరితహారం హరి అయిపోయిందా? కొత్త ప్రభుత్వంలో వన మహోత్సవం ఎప్పుడో ??

హరితహారం హరి అయిపోయిందా? కొత్త ప్రభుత్వంలో వన మహోత్సవం ఎప్పుడో ??

 నిజామాబాద్ జిల్లా ప్రతినిధి; (లోకల్ గైడ్)
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పదేళ్ల కాలం లో వానలు రావాలి కోతులు పోవాలి అనే నినాదంతో హరితహారం కార్యక్రమానికి అప్పటి ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.. అయితే ప్రతి సంవత్సరం  ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రభుత్వ ప్రైవేటు మరియు స్వచ్ఛంద సంస్థలు వర్షాకాలం ముందు నుండి హరితహారం కార్యక్రమం ద్వారా మొక్కలు నాటేవారు..అయితే తెలంగాణ ప్రభుత్వం అధికారం కోల్పోయిన అనంతరం కొత్త ప్రభుత్వ పాలనలో హరితహారం కార్యక్రమం వెనక్కి తగ్గుతున్నట్లు పర్యావరణ ప్రేమికులు, స్థానిక ప్రజలు అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు. మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం అన్నదానిపై ఇప్పుడు సరైన దృష్టి లేదంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత తెలంగాణ ప్రభుత్వం హరితహారం
2015లో ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా కోట్లాది మొక్కలు నాటడం, పచ్చదనాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. పాఠశాలలు, రహదారి ప్రక్కలు, ప్రభుత్వ భూములు, గ్రామ పంచాయితీల పరిధిలో మిలియన్ల సంఖ్యలో మొక్కలు నాటబడ్డాయి. ప్రత్యేకంగా  అటవీశాఖ అధికారుల ఆధ్వర్యంలో వాటి సంరక్షణకు బృందాలు ఏర్పాటు చేయడం, గ్రామ సర్పంచులకు లక్ష్యాలు కేటాయించడం వంటి చర్యలు సైతం చేపట్టారు. ప్రస్తుత ప్రభుత్వం హరితహారం విషయంపై మౌనంగా ఉండటం పట్ల ప్రకృతి ప్రేమికులు, పలువురి నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.. పలు ప్రాంతాల్లో గతంలో నాటిన మొక్కలు ఎండిపోయినా, వాటి సంరక్షణపై ఎలాంటి చర్యలు కనిపించడం లేదు. వనమహోత్సవాలు, సాంఘిక వన సమ్మేళనాలు నిర్వహించాల్సిన వనరులే లేకుండా పోయినట్టు తెలుస్తోంది. పర్యావరణ  ప్రకృతి ప్రేమికులు హరితహారం కార్యక్రమం వల్ల గ్రామాల్లో పచ్చదనం పెరిగింది. కానీ ఇప్పుడు ఆ పథకం కొనసాగుతుందా లేదా అనేది స్పష్టత లేకుండా పోయిందని పలువురు ప్రకృతి ప్రేమికులు తమ అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తున్నారు.. కొత్త ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని కొనసాగించకపోతే, గతంలో వేసిన శ్రమ వృథా అవుతుందన్నారు. అయితే గతంలో మాదిరిగా హరితహారాన్ని కొనసాగించాలి మొక్కల సంరక్షణకు పునరుద్ధరణ చర్యలు చేపట్టాలి. గ్రామ, మున్సిపల్ స్థాయిలో పర్యవేక్షణ మళ్లీ ప్రారంభించాలి. పాఠశాలల స్థాయిలో విద్యార్థుల ద్వారా అవగాహన పెంచాలి. పర్యావరణం రక్షించాలంటే అటవీ శాఖ మంత్రివర్యులతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలు ముందడుగు వేయాలని ప్రజలు, సామాజిక సేవకులు కోరుతున్నారు..మరి హరితహారం కార్యక్రమానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో వేచి చూడాల్సిందే... ప్రభుత్వం పచ్చదనం కోసం హరితహారం కార్యక్రమం చేపట్టాలని పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యంగా ప్రజాభిప్రాయాన్ని తెలంగాణ లోకల్ గైడ్ జాతీయ తెలుగు దినపత్రిక తెలియపరుస్తుంది..
 సంపాదకులు

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి

నక్క రాకేష్ 

Tags:

About The Author

Advertisement

Latest News