తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజులు వర్షాలు – బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం
లోకల్ గైడ్, తెలుగు రాష్ట్రాల్లో మొదలు పెట్టిన వర్షాలు ఇంకా కొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే మూడు నుండి నాలుగు రోజుల పాటు ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.ఇప్పటికే ఇరు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల వర్షాలు కురుస్తుండగా, ఇందువల్ల రైతులకు మేలు చేకూరనుందని అధికారులు పేర్కొన్నారు.బంగాళాఖాతంలో రాబోయే 24 గంటల్లో కొత్తగా ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రస్తుతం ఉత్తర ఒడిశా–పశ్చిమ బెంగాల్ తీరాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అదే ప్రాంతంలో ఇది అల్పపీడనంగా మారే అవకాశముందని తెలిపారు.అలాగే, ఇంకొక ద్రోణి కూడా విస్తరించి ఉందని, ఇది వర్షాల ప్రవాహాన్ని మరింత పెంచే అవకాశముందని అధికారులు చెప్పారు. ఈ రెండు వాతావరణ వ్యవస్థల ప్రభావంతో ఏపీ, తెలంగాణలో నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని స్పష్టం చేశారు.