పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్ గ్రేడ్ చేయాలి..

పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్ గ్రేడ్ చేయాలి..

మంచిర్యాల (లోకల్ గైడ్): బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్ గ్రేడ్ చేయాలని ఎంసిపిఐయు జిల్లా కార్యదర్శి సభని రాజేంద్రప్రసాద్ సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ లు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు మంగళవారం వినతిపత్రం అందజేశారు.పాలిటెక్నిక్ కళాశాలలో టిజి ఈసెట్ ప్రారంభోత్సవానికి హాజరైన ఎమ్మెల్యేకు కళాశాల అప్ గ్రేడ్ విషయమై వివరించారు.ఎంతోమంది విద్యార్థుల,యువకుల పోరాట ఫలితంగా అప్పటి ప్రభుత్వం1993 సంవత్సరంలో బెల్లంపల్లి కేంద్రంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేసిందని,బెల్లంపల్లి సింగరేణి ప్రాంతం అయినందున కళాశాలలో మైనింగ్,ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇతర కోర్సులను అందుబాటులో ఉంచిందని,ప్రతి సంవత్సరం వందలాదిమంది విద్యార్థులు ఈ కోర్సులను అభ్యసిస్తు ఉత్తీర్ణులవుతున్నారని అన్నారు.ఈ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్ గ్రేడ్ చేయాలని గత కొన్ని సంవత్సరాలుగా స్థానిక ప్రజలు,విద్యార్థులు కోరుకుంటున్నారని,రాజకీయ నాయకులు ఎన్నికలు వచ్చినప్పుడల్లా కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్ గ్రేడ్ చేస్తామని కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను మభ్యపెడుతు మోసగిస్తున్నారని,నాటినుండి నేటి వరకు పాలిటెక్నిక్ కళాశాలగానే మిగిలిందని,ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా చొరవ తీసుకొని అప్ గ్రేడ్ చేయించలేదని,దీంతో అనేక మంది విద్యార్థులు కరీంనగర్,వరంగల్,హైదరాబాద్ లాంటి సుదూర ప్రాంతాలకు వెళ్లి చదువుకునే స్తోమత లేక సాంకేతికవిద్యకు(ఇంజనీరింగ్) దూరమవుతున్నారని తెలిపారు.గత సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం తొమ్మిది కళాశాలలను ఇంజనీర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేసిందని,అందులో బెల్లంపల్లి పాలిటెక్నిక్ కళాశాల పేరు లేకపోవడం చాలా బాధాకరమని, ఇప్పటికైనా ఎమ్మెల్యే స్పందించి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్ గ్రేడ్ చేసి విద్యార్థుల ఉన్నత విద్యకు తోడ్పాటును అందిస్తు వారికి సహకరించాలని కోరారు.

Tags:

About The Author

Advertisement

Latest News

పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్ గ్రేడ్ చేయాలి.. పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్ గ్రేడ్ చేయాలి..
మంచిర్యాల (లోకల్ గైడ్): బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్ గ్రేడ్ చేయాలని ఎంసిపిఐయు జిల్లా కార్యదర్శి సభని రాజేంద్రప్రసాద్ సహాయ కార్యదర్శి పసులేటి...
భూ సమస్యల పరిష్కారానికే భూభారతి రెవెన్యూ సదస్సులు
తెలంగాణలో మరో ఐదు రోజులపాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిక
వన్డే బ్యాటింగ్ ర్యాంకుల్లో స్మృతి మంధాన అగ్రస్థానం
పాయాను త‌ర‌చూ తింటే క‌లిగే లాభాలు .......
ఇంటర్నేషనల్ యోగ డే 2025 జూన్, 21 న పతంజలి ఉచిత యోగా శిక్షణ కార్యక్రమం
సదరం సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలి