రైలు పట్టాలపై కారు నడిపిన యువతి – రంగారెడ్డిలో కలకలం
లోకల్ గైడ్: ఇటీవల కాలంలో రైల్వే ట్రాకులపై స్టంట్లు, రహదారులపై ప్రమాదకర వీడియోలు, లేదా డ్రగ్స్ మత్తులో అనూహ్య ప్రవర్తనలు పెరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ కోవకు చెందిన మరో ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే నాగులపల్లి ప్రాంతంలో, ఓ యువతి కారును నేరుగా రైలు పట్టాలపై నడిపించి స్థానికులను, రైల్వే అధికారులను షాక్కి గురిచేసింది. నాగులపల్లి నుంచి శంకర్పల్లి వెళ్లే రూట్లో, రైల్వే ట్రాక్పై కారు నడపడంతో రైళ్లను తాత్కాలికంగా నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.లోకోపైలట్ అప్రమత్తమై రైలును ఆపేశాడు. అయితే కారు ట్రాక్ మధ్యలో నిలిచిపోవడంతో స్థానికులు స్పందించి యువతిని ఆపారు. వెంటనే ఆమెను పోలీసులకు అప్పగించారు.ప్రస్తుతం ఆమెను శంకర్పల్లి పోలీసులు విచారిస్తున్నారు. ప్రాథమికంగా ఆమె ఉత్తరప్రదేశ్లోని లక్నోకు చెందిన రబికా సోనీ అని గుర్తించారు. ప్రశ్నలు అడిగినప్పటికీ ఆమె మౌనంగా ఉండడం, అధికారుల్లో అనేక అనుమానాలకు దారితీస్తోంది. దీంతో ఆమెను చేవేళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించివైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.ఈ ఘటనపై రీల్స్ కోసం చేసిన ప్రయత్నమా? డ్రగ్స్ మత్తులో తీసుకున్న నిర్ణయమా? ఆత్మహత్య యత్నమా? లేక మానసిక సమస్యా? అన్న అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.ఈ ఘటన కారణంగా గంటల పాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు రైల్వే అధికారులు తెలిపారు. పోలీసులు పూర్తి దర్యాప్తు ప్రారంభించారు.