మాదకద్రవ్యాల నిరోధానికి విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి- జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్

 మాదకద్రవ్యాల నిరోధానికి విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి- జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్

అంతర్జాతీయ మాలిక్ ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పోస్టర్ను ఆవిష్కరిస్తున్న  జిల్లా అధికారులు.           

 రంగారెడ్డి, ( లోకల్ గైడ్ ): మాదకద్రగాలని నిరోధానికి విస్తృత స్థాయిలో అధికారులు అవగాహన కల్పించాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమసింగ్ అన్నారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో  జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ అధ్యక్షతన మత్తు పదార్థాల నిరోధక కమిటీ జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. గురువారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం - అక్రమ రవాణ వ్యతిరేక దినోత్సవంపురస్కరించుకొని అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ "మాదకద్రవ్యాల అక్రమ రవాణా, దుర్వినియోగం పై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని,  డ్రగ్స్ వాడకం వలన కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందని  అధికారులచే ప్రతిజ్ఞ చేయించారు.  ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా డ్రగ్స్ అమ్మకాలు, , కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియ చేయాలని సూచించారు. డ్రగ్ రహిత జీవనశైలిని అనుసరించి డ్రగ్-రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.  మత్తు పదార్థాల నియంత్రణకు చేపట్టిన చర్యలపై చర్చించి, ఇకముందు  చేపట్టవలసిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. మాదక ద్రవ్యాలు సేవిస్తే  కలిగే దుష్పరిణామాల గురించి ప్రజలలో అవగాహన పెంపొందించేందుకు సామాజిక మాధ్యమాలతో పాటు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. మత్తు పదార్థాల వాడకం అనేది సమాజానికి పట్టిన చీడపురుగు వంటిదన్నారు.  డ్రగ్స్ వినియోగాన్నిసమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రభుత్వం, పోలీసు శాఖ, యువత సమాజంలోని అన్ని వర్గాలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.  డ్రగ్స్ వినియోగం యెుక్క దుష్ప్రభావాల గురించి యువతకు పరిజ్ఞానం కల్పించేందుకు సోషల్ మీడియాతోపాటు కళాశాలల్లో, పాఠశాలలో కూడా రాచకొండ కమిషనరేట్ ద్వారా ప్రభుత్వ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. సాధారణ ప్రజలు, విద్యార్థులు అందరూ డ్రగ్స్ రహిత సమాజం తమ బాధ్యతగా భావించాలని, తమ పరిసరాల్లో, కాలేజీల్లో, పాఠశాలల్లో మత్తు పదార్థాల వాడకం గురించి పరిశీలిస్తూ ఉండాలని సూచించారు.  తెలిసీ తెలియక మత్తు పదార్థాల బారిన పడడం వల్ల యువత బంగారు భవిష్యత్తు నాశనం అవుతోందన్నారు.  యువత యొక్క శారీరక మానసిక ఆరోగ్యాన్ని మత్తు పదార్థాలు విచ్ఛిన్నం చేస్తున్నాయని తెలిపారు. డ్రగ్స్ మీద పోలీసులు చేస్తున్న పోరాటంలో యువత తమ వంతు భాధ్యత నిర్వహించాలని, డ్రగ్స్ వినియోగానికి దూరంగా ఉండడంతో పాటు, తమ దృష్టికి వచ్చే నిషేధిత డ్రగ్స్ సరఫరా మరియు వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని తక్షణమే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. అనంతరం అదనపు కలెక్టర్ డ్రగ్స్ కు నో చెప్పండి, Say To No Drugs పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సమావేశంలో చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళ, జిల్లా అటవీ శాఖ అధికారి సుధాకర్ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి నరసింహ రావు, బిసి సంక్షేమ శాఖ అధికారి కేషురామ్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి రామేశ్వరి దేవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు, పోలీసు అధికారులు, ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్లు కృష్ణప్రియ, ఉజ్వల, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News