నాడు రాజ్యాంగాన్ని హత్య చేసిన కాంగ్రెస్ నేడు రాజ్యాంగాన్ని రక్షిద్దాం అంటుంది

నాడు రాజ్యాంగాన్ని హత్య చేసిన కాంగ్రెస్ నేడు రాజ్యాంగాన్ని రక్షిద్దాం అంటుంది

 రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను ఎన్నికల్లో ఓడించిన కాంగ్రెస్ మళ్ళీ దొంగ జపం చేస్తుంది

నేను తప్పా ఇంకెవ్వరు పాలించవద్దని ఇందిరా గాంధీ కుటిలత్వం 1975 ఏమర్జెన్సీ.

ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం భద్రంగా ఉంది

మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు.

వికారాబాద్ జిల్లా ప్రతినిధి,
లోకల్ గైడ్:

వికారాబాద్ జిల్లా పరిధిలోని కుల్కచర్ల మండల కేంద్రంలోని విజయ్ చంద్ర ఫంక్షన్ హాల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సంవిధాన్ ముఖ్య దివాస్ రాజ్యాంగ హత్య దినం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మెదక్ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు మాట్లాడుతూ
ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు దేశ విచ్చినానికి ఆద్యం పోస్తూ నాటి నుండి నేటి దాక భారత ప్రజల సొమ్మును దోచుకున్నారని, వరసత్వాంగా దేశాన్ని నాశనం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. రాజ్యాంగబద్ధంగా జరిగిన ఎన్నికల్లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను ఓడించిన కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని ఎలా రక్షిస్తుందన్నారు, దేశంలో తను ఒక్కదాని ఆధిపత్యం నడవాలని అహంకారంతో ప్రజాస్వామ్య హక్కులను కాలరాసి మరి ఎవరు అధికారంలోకి రావద్దని కుట్రలతో 1975 ఎమర్జెన్సీ విధించింది అన్నారు, దేశ ప్రధానికి నరేంద్ర మోడీ నాయకత్వం దేశం భద్రంగా ఉందని బిజెపి నాయకులు కార్యకర్తలు సగౌరవంగా ముందుకు సాగుతూ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని, రేపు జరగబోయే సమస్యలు ఎన్నికల్లో బిజెపి సత్తా చాటాలన్నారు.

ప్రజాస్వామ్యంలో చీకటి రోజు ఎమర్జెన్సీ

వికారాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి

దేశ ప్రజలను ఆదినుండి నేటి వరకు దోచుకుంటూన్న కాంగ్రెస్ పార్టీ ఆరోజుల్లో ప్రజాస్వామ్యాన్ని చీకట్లోకి నెట్టి దేశ పరిపాలన వ్యవస్థను అస్తవ్యస్తం చేసి దేశ వెనుకబాటుకు కారణమై అన్ని వ్యవస్థలను నాశనం చేసిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ తిరిగి అధికారంలోకి రావడానికి దేశ ప్రజలపై ముసలి కన్నీరు కారుస్తూ దొంగ ప్రేమను చూపిస్తుందన్నారు, మొన్న జరిగిన ఎన్నికల సమయంలో రాజ్యాంగానికి ప్రమాదం ఉందంటూ బిజెపిపై తప్పుడు ప్రచారం చేస్తూ తప్పుడు హామీలు ఇస్తూ అధికారంలోకి వచ్చి రాజకీయ పబ్బం గడుపుకోవాలని  దిగజారుడు రాజకీయాలు చేస్తుందన్నారు, దేశంలో ప్రజాస్వామ్య పాలన సాగాలంటే భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమన్నారు.అనంతరం ఎమర్జెన్సీ సమయంలో జైల్లో ఉన్న మేకల అనంతయ్య, ప్రహలాద్ రావు తదితరులకు సన్మానం చేశారు, ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రహ్లాద రావు, సదానంద రెడ్డి, యు రమేష్, కోకట్ మాధవరెడ్డి, మిట్ట పరమేశ్వర్, రాంచందర్, వడ్ల నందు, అమరేందర్ రెడ్డి, ఆచారి, వివేకానంద రెడ్డి, వివిధ మండలాల అధ్యక్షులు నాయకులు, కార్యకర్తలు తదితరులు.

Tags:

About The Author