భవిష్యత్తు బాగుపడాలంటే మారకద్రవ్యాల జోలికి విద్యార్థులు వెళ్ళవద్దు.
రాష్ట్ర రోడ్డు భవనాల, సినిమాటో గ్రఫీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
నల్లగొండ .లోకల్ గైడ్ .భవిష్యత్తు బాగుండాలంటే మాదకద్రవ్యాల జోలికి వెళ్లవద్దని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విద్యార్థులకు సూచించారు.గురువారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలో జిల్లా పోలీస్ యంత్రాంగం, సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవంలో భాగంగా ఎన్ జి కళాశాల నుండి క్లాక్ టవర్ వరకు నిర్వహించిన ర్యాలీని ఆయన ఎన్ జి కళాశాల వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ క్లాక్ టవర్ చేరుకున్న అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కరోనా తర్వాత డ్రగ్స్ వాడకం పెరిగిందని, స్టూడెంట్స్ డ్రగ్స్ కు బానిసలుగా మారుతున్నారని, తెలంగాణలో డ్రగ్స్ అన్నదే ఉండరాదని, విద్యార్థుల కోసం స్కిల్ యూనివర్సిటీ కట్టిస్తున్నామని ,ఇందులో భాగంగా నల్గొండలో 34 కోట్లతో స్కిల్ సెంటర్ కట్టిస్తున్నామన్నారు.త్వరలోనే సి ఎం తోదీనిని ప్రారంభిస్తామని, డ్రగ్స్ వాడే వారిని తరిమి కొట్టాలని,విద్యార్థులకు లైఫ్ టర్నింగ్ టైం అని,20 ఏండ్ల వరకు చదువు,స్పోర్ట్స్,యోగ పై దృష్టిపెట్టాలని,కోరారు.
విద్యార్థులు,యువత సెల్ ఫోన్ కు దూరంగా ఉందాలని, అవసరమైతేనే వాడాలని,చదువుపైనే దృష్టి పెట్టాలని చదివి పోటీ పరీక్షలు రాస్తూ ఉద్యోగాలు పొందాలని, ప్రకాశం బజార్ లో ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాఠశాల నిర్మిస్తున్నామని,డిజిటల్ తరగతుల తో పాటు, అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. భవిష్యత్ బాగుండాలంటే డ్రగ్స్ కు దూరంగా ఉందాలని, విద్యార్థులకు ఎం కావాలన్న ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ,మంత్రిగా సహకారం అందిస్తామన్నారు. డ్రగ్స్ కువ్యతిరేకంగా చురుకుగా ఉందాల ని,హైద్రాబాద్ లో డ్రగ్స్ పై కఠిన చర్యలుతీసుకొంటున్నామని,ఎక్కడికక్కడే కట్టడి చేస్తున్నామని తెలిపారు.ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ యువత మాదకద్రవ్యాల కు దూరంగా ఉండాలన్నారు.జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ మిషన్ పరివర్తన కింద వారం రోజులపాటు మాదక ద్రవ్యాల వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. యువత ఒక్కసారి డ్రగ్స్ తీసుకుంటే బానిసలు అవుతారని, అందువల్ల తీసుకోవద్దని,డ్రగ్స్ పై చేస్తున్న యుద్ధంలో అందరూ భాగస్వాములు కావాలని, డ్రగ్స్ గురించి ఏదైనా సమాచారం అందితే డయల్ 100 కు ఫోన్ చేయాలని ,డ్రగ్స్ వల్ల కుటుంబాలే నాశనం అవుతాయని అన్నారు.నల్గొండ జిల్లా ను డ్రగ్స్ రహిత జిల్లా చేద్దామని పిలుపునిచ్చారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె .శ్రీనివాస్, మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నిర్మూలనలోఅందరూ భాగస్వాములు కావాలని, డ్రగ్స్ వాడడం చట్టరీత్య నేరమని, విద్యార్థులు డ్రగ్స్ బారిన పడవద్దనికోరారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, ఆదనపు ఎస్పీ రమేష్, డి డబ్ల్యుఓ కృష్ణవేణి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి.డి ఈ ఓ భిక్షపతి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి,ఎస్ పిలు కార్యక్రమంలో పాల్గొన్న వారితో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు .