వేధిస్తున్న వంట మనుషుల కొరత!

వేధిస్తున్న వంట మనుషుల కొరత!

- సరిపడా సిబ్బంది లేక భోజనం వడ్డిస్తున్న విద్యార్థులు. 

- సుమారు 378 మంది విద్యార్థులకు గాను ముగ్గురు వంట మనుషులు.

- సరిపడ సిబ్బంది లేక అధిక పని భారం పడుతుంది. 

- కేజీబీవీలో వంట మనుషుల ఆవేదన.

లోకల్ గైడ్/ తాండూర్:
పెద్దేముల్ మండల పరిధిలోని మారేపల్లి గేట్ సమీపంలో గల కేజీబీవీ పాఠశాల మరియు కళాశాలలో వంట మనుషుల సిబ్బంది కొరత అధికంగా ఉందని ప్రిన్సిపల్ రాజేశ్వరి గురువారం మీడియాతో తెలిపారు.మొత్తం ఐదు మంది వంట మనుషులు అవసరం ఉండగా, ప్రస్తుతం ముగ్గురు ఉన్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు.ఇంకా మిగతా ఇద్దరు వంట మనుషులు కావాల్సి ఉందని వారు తెలిపారు.ప్రస్తుతమున్న ముగ్గురు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు పనిచేస్తున్నారని స్పష్టం చేశారు.వారికి తోడు ఇంకా ఇద్దరు వంట మనుషులు అవసరం ఉన్నట్లు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే, సరిపడా సిబ్బంది లేక తోటి విద్యార్థులే,వంట మనుషుల అవతారం ఎత్తి విద్యార్థులకు భోజనం వండిస్తున్న పరిస్థితి కేజీబీవీలో ఏర్పడింది. 

సిబ్బంది లేక పని భారం మోయలేక.
సుమారు 12 సంవత్సరాల నుంచి తక్కువ జీతానికి కేజీబీవీలో పని చేస్తున్నాము.378 మంది విద్యార్థులకు ఉదయం నుంచి సాయంత్రం వరకు వంట చేస్తున్నాము.ఏండ్లు గడుస్తున్నా..రూ.9700 లకే పనిచేస్తున్నాము.సరిపడ సిబ్బంది లేకపోవడంతో, తమ పైన అధిక భారం పడి అధికంగా శ్రమించాల్సి వస్తుందని కేజీబీవీలోని వంట మనుషులు అభిప్రాయం వ్యక్తం చేశారు.దీంతో,ఆహార నాణ్యతపై ప్రభావం చూపుతోందని,తద్వారా విద్యార్థినులకు సమయానికి భోజనం అందకపోవడం,విద్యార్థినుల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంటుందని వారు తెలిపారు.ఈ నేపథ్యంలో...భవిష్యత్తులో హాస్టల్ల పైన తల్లిదండ్రులు నమ్మకం కోల్పోవచ్చు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.కాబట్టి...తక్షణం మరో ఇద్దరు వంటమనుషులను నియమించి,తమ పైన భారాన్ని తగ్గించాలని వంట మనుషులు అధికారులను వేడుకుంటున్నారు.

Tags:

About The Author

Latest News