ఇందిరమ్మ ఇళ్లకు నిధులు కేంద్ర ప్రభుత్వం మాంజూరు  కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వనివి కాదు

ఇందిరమ్మ ఇళ్లకు నిధులు కేంద్ర ప్రభుత్వం మాంజూరు  కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వనివి కాదు

----మొదటి బిల్లు కేంద్రానిదే కాదని నిరూపిస్తే

------ఖిల్లా ఘనపురంలో ముక్కు నేలకు రాస్తా

------జాతీయ ఓబిసి కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి

వనపర్తి లోకల్ గైడ్ 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 11 ఏళ్ల  వికసిత్ భారత్ సంకల్ప సభ ఖిల్లా ఘనపూర్ మండల అధ్యక్షుడు బుచ్చిబాబు గౌడ్ అధ్యక్షతన  నిర్వహించారు.వికసిత్ భారత్ సంకల్ప సభకు ముఖ్యఅతిథిగా హాజరైన  జాతీయ ఓబిసి కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి 
జిల్లా అధ్యక్షులు డి. నారాయణ హాజరై మండల కేంద్రంలోని రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి అనంతరం బస్టాండ్ నుంచి  కళ్యాణ మండపం వరకు భారీ ర్యాలీ నిర్వహించుకుని మండపం ఆవరణలో పర్యావరణ పరిరక్షణకై మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథి జాతీయ ఓబిసి కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి మాట్లాడుతూ 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో డబ్బున్న వారికే పరిమితమైన బ్యాంక్ అకౌంట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చొరవతో 55 జన్ ధన్ జీరో అకౌంట్ లు ఓపెన్ అయ్యాయని ఈ అకౌంట్ ద్వారా నేరుగా సంక్షేమ పథకాల డబ్బులు ప్రజలకు చేరుతున్నాయని, స్వచ్ఛ భారత్ పథకం కింద 18 కోట్ల మరుగుదొడ్లు నిర్మాణం చేసి మహిళల ఆత్మ గౌరవ సమస్యను తీర్చారని కరోనా సమయంలో ప్రపంచం తలకిందులు అవుతుంటే మోదీ గారు దేశీయంగా రెండు కోవిడ్ టీకాలను ఉత్పత్తిలోకి తీసుకువచ్చి ఒక్కొక్కటి 18 వేల విలువగల టీకాలను రెండు డోసులను ఉచితంగా వేసి దేశంలో కరోనా మరణాలను దూరం చేసి ప్రపంచంలోని పేద దేశాలకు మానవతా సాయం చేశాడని, 2022 నుండి 2029 వరకు దేశంలోని 80 కోట్ల మంది ప్రజలకు ఆరు కిలోల ఉచిత రేషన్ బియ్యం పంపిణీ చేస్తూ ఆపద్బాంధవుల నిలిచాడని తెలంగాణ రాష్ట్రంలో  ఇస్తున్న సన్న బియ్యం 6 కిలోలలో ఐదు కిలోలకు కిలోకి 40/- కేంద్రం భరిస్తుంటే కేవలం ఒక కిలో ఇచ్చిన రేవంత్ రెడ్డి ఉత్తర కుమారుల ప్రగల్భాలు పలుకుతున్నాడని, 11 ఏళ్ల పాలనలో దేశంలో అతి తీవ్ర పేదరికం నుండి 26.5 కోట్ల మంది బయటకు వచ్చారని ప్రపంచ పేరెన్నిక గల ఆర్థిక సర్వేలు తెలియజేస్తున్నాయని ఇది కాదా వికసిత్ భారత్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో గత శాసనసభ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన ఉచిత వాగ్దానాలకు ఓటేసి గద్దెనెక్కించిన ప్రజలను రేవంత్ రెడ్డి పూర్తిగా ముంచాడని మహాలక్ష్మి కింద ఆడపడుచులకు 2500/- వృద్ధాప్య పెన్షన్ 4000/- నిరుద్యోగ భృతి 4016/- కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లక్ష తో పాటు తులం బంగారం 18 ఏళ్లు నిండిన విద్యార్థినికి ఉచిత స్కూటీ పథకం 500 కే సిలిండర్ 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు రైతులకు, కౌలు రైతులకు ఏడాదికి రైతు భరోసా 16,000/- రైతు కూలీలకు 12000/-, 2 లక్షల రుణమాఫీ పథకాలు ఏవి కూడా అమలుకు నోచుకోలేదని అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల పేరిట కాంగ్రెస్ నాయకులు డ్రామాలాడుతూ గ్రామ సభలలో వందలాది ఇళ్లను మంజూరు చేసినట్లుగా నాటకాలాడి కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే  నేడు 10, 20 మంజూరు చేసి ముగ్గులు పోస్తున్న ఇళ్లకు మొదటి బిల్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఇచ్చిన డబ్బులను లబ్ధిదారులకు అందజేస్తున్నారని ఇది అబద్ధమైతే ఖిల్లా ఘనపూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ ముందు ముక్కు నేలకు రాస్తారని సవాల్ విసిరారు.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా గ్రామాలలో ఇల్లు లేని పేదలందరికీ ఇల్లు మంజూరుకు నరేంద్ర మోడీ సిద్ధంగా ఉన్నారని కానీ గతంలో కేసీఆర్ చేసిన తప్పులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరావృతం చేస్తూ బీద ప్రజలకు ఇల్లు కట్టుకునే అవకాశం ఇవ్వట్లేదని 6 గ్యారంటీలు 420 హామీల అబద్ధపు హామీలను ఇచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీలను అమలు చేయలేక చేతులెత్తేసారని 16 నెలలుగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిపే దమ్ము ధైర్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేదని హైకోర్టు తీర్పుతో రాబోయే మూడు నెలల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించక తప్పని పరిస్థితి ఉందని  స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వస్తే చీపురుమలచి వీపులు వాతపడేలా తరిమి తరిమి కొట్టాలని 11 ఏళ్ల పాలనలో ఒక్క అవినీతి మరక లేకుండా  పేద ప్రజల అభివృద్ధికై ఆలోచిస్తూ రోజుకు 18 గంటలు పనిచేసే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి మద్దతుగా కమలం పువ్వు గుర్తుకు ఓటేసి స్థానిక ఎన్నికల్లో బిజెపిని గెలిపించాలని తెలియజేశారు.

 


సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షులు డి.నారాయణ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయ్యగారి ప్రభాకర్ రెడ్డి సర్పంచుల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బి శ్రీశైలం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ. రామన్ గౌడ్ జిల్లా ఉపాధ్యక్షులు మండల ఇంచార్జ్ ఏ సీతారాములు ఉపాధ్యక్షులు బి కుమారస్వామి జిల్లా కోశాధికారి భాశెట్టి శీను జిల్లా అధికార ప్రతినిధి మీడియా ఇంచార్జి పెద్దిరాజు పంచాయతీ రాజ్ సెల్ జిల్లా కన్వీనర్ ఉప్పుటూరు విక్రమ్ రెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యులు గోపీనాథ్ యాదవ్ సత్యనారాయణ కిసాన్ మోర్చా జిల్లా  ఉపాధ్యక్షులు కొన్నూరు రాంరెడ్డి ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు ఆశన్న ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మేదరి శివశంకర్ మాజీ మండల అధ్యక్షులు నవీన్ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శులు దశరథం గోపాల్ రెడ్డి యువమోర్చా అధ్యక్షులు గోపాల్ ముదిరాజ్ యువ మోర్చా ప్రధాన కార్యదర్శి సిరిసాల సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News