ఈనాటి బాలలే రేపటి పౌరులు
- విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణీ
- ప్రభుత్వ కళాశాలలో చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలి
జిల్లా ఇంటర్మీడియట్ విద్య అధికారి శంకర్ నాయక్
వికారాబాద్ జిల్లా, లోకల్ గైడ్:
మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన “వికారాబాద్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శ్రీ శంకర్ నాయక్ మాట్లాడుతూ, ప్రభుత్వ కళాశాలల్లో చదివిన విద్యార్థులే ఉన్నత విజయాలను సాధించారని, మీరు కూడా దౌల్తాబాద్ ప్రభుత్వ కళాశాలలో చేరి శ్రద్ధగా చదివి, ఉన్నత విజయాలు సాధించాలని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వం మన మండలంలో జూనియర్ కళాశాల మంజూరు చేసి, అనుభవజ్ఞులైన 12 మంది అధ్యాపకులను నియమించడం జరిగింది. కావున స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, తల్లిదండ్రులు తమ పిల్లలను మన కళాశాలలోనే చేర్పించవలసిందిగా సూచించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల దౌలతాబాద్ లో ఎంపీసీ, బైపీసి, సిఇసి, హెచ్ఇసి గ్రూపులకు సంబంధించి ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియం కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తను ప్రత్యేకంగా చొరవ తీసుకొని కళాశాల అభివృద్ధికి, పిల్లల ఉన్నతమైన భవిష్యత్తు కోసం కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటర్మీడియట్ జిల్లా విద్యాధికారి శంకర్ నాయక్ కొడంగల్ కళాశాల ప్రిన్సిపాల్ నరసింహరెడ్డి ఎంఈఓ వెంకటస్వామి దౌల్తాబాద్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ హరిరెడ్డి రిటైర్డ్ హెడ్మాస్టర్ ప్రభాకర్ స్థానిక నాయకులు వెంకటరెడ్డి ఉపాధ్యాయులు సాయిల్ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.