ప్రజల్లో పోలీసుల పట్ల గౌరవ మర్యాదలను పెంపొందించాలి
--వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్
By Ram Reddy
On
వరంగల్ (లోకల్ గైడ్ ): ప్రజలకు నిజాయితీతో సేవలందిస్తే సమాజంలో పోలీసుల పట్ల గౌరవ మర్యాదలు పెరుగుతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలియజేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎస్సైలుగా పదోన్నతి పొందిన తోట వీరస్వామి, కే పోచయ్య, ఎం రమేష్, ఎం సుధాకర్, పి రమేష్ లు శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనర్ ను మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుష్టాలు అందజేశారు. ఈ సందర్భంగా కు పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా పదోన్నతి పొందిన అధికారుల భుజాలపై నక్షత్రాలను అలంకరించి అభినందనలు తెలియజేసారు.అనంతరం సీపీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు పోలీసుల పట్ల భరోసా నమ్మకాన్ని కలిగించడంతో పాటు, నిరుపేద ప్రజలకు పోలీస్ అధికారులు అండగా నిలవాలని ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ పదోన్నతి పొందిన ఎస్ఐలకు సూచించారు.
Tags:
About The Author
Latest News
20 Jun 2025 17:45:01
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి; (లోకల్ గైడ్)తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పదేళ్ల కాలం లో వానలు రావాలి కోతులు పోవాలి