అక్రమ బోర్ల ఫై చర్యలు తీసుకోవాలి - నీటి వ్యాపారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్
లోకల్ గైడ్ మియాపూర్ : శేరిలింగంపల్లి మండల పరిధిలోనీ మక్త మహబూబ్ పేట్ లో అక్రమంగా నడుస్తున్న నీటి బోర్ల ఫై చర్యలు తీసుకోవాలనీ గ్రామస్తులు శేరిలింగంపల్లి ఎమ్మార్వోకు వినతి పత్రం అందజేశారు.'మక్తా గ్రామంలో కొంతమంది పెత్తo దారులు అక్రమంగా బోర్లు వేసి ట్యాంకర్ల ద్వారా నీటిని ఆమ్ముకుంటున్నారనీ, ట్యాంకర్ల ద్దార నీళ్లు అమ్మడం ద్వారా గ్రామంలోనీ ఇండ్లల్లో ఉన్న బోర్లు ఎండి పొయి నీటికి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు. గ్రామంలో గతంలో కొందరు అక్రమంగా వేల ఫీట్ల లోతులో బోర్లు వేసి నీటి వ్యాపారం చేయడం వల్ల, తమ ఇండ్లలో బోర్లు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సత్యనారాయణ ఎన్ క్లేవ్ లో ఓ ఇంటీ గేటు ముందు బోరు వేసి, ఇంటీ వెనుకవైపు సంపు కట్టి దాంట్లో నీటిని నింపి అక్కడి నుండి ట్యాంకర్ల ద్వారా నీటి వ్యాపారం చేస్తున్నారని పేర్కొన్నారు. గ్రామం లో కూడా ఓ వ్యక్తి ఇలా చేయడం వల్ల కూడా తమ ఇండ్లలో బోర్లు ఎండి పోయి తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. అక్రమ నీటి వ్యాపారం చేయడం వలన గ్రామ ప్రజలకు నీటి కష్టాలకు గురిఅవుతున్నారు. కొత్తరా నీటి ట్యాంకరులను నిలిపివేసి వారి బోర్లను తీయించగలరనీ కోరారు. ట్యాంకర్లను నిలిపి వేసి, తమ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మక్తా లో తక్షణంమే అక్రమ నీటి వ్యాపారుల పై కఠిన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరారు. ఈ విషయం ఫై గతం లో ఎన్ని సార్లు పిర్యాదులు చేసిన అధికారులు పట్టించుకోలేరని ఆగ్రహం వ్యక్తo చేశారు. ఇప్పుడు కూడా చర్యలు తీసుకోకపోతే ఉన్నతాదికారుల ద్రుష్టికి తీసుకు పోయి, స్థానిక అధికారుల ఫై పిర్యాదు చేస్తామని అన్నారు. లేని యెడల ఎమ్మార్వో కార్యాలయం ముందు ఆందోళన చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు.