ప్రభుత్వ మెడికల్ కళాశాలను సందర్శించిన డి.ఎం.ఈ. బృందం

ప్రభుత్వ మెడికల్ కళాశాలను సందర్శించిన డి.ఎం.ఈ. బృందం

లోకల్ గైడ్: ఖమ్మం : 

గురువారం ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాల మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రాష్ట్ర సంచాలకులు డా. నరేందర్ కుమార్, గాంధీ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా. ఇందిర ఆధ్వర్యంలో డి.ఎం.ఈ. బృందం ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శించి, అన్ని విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు.గతంలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ కళాశాలలను ఆన్ లైన్ విధానంలో స్టాండర్డ్స్ ను పరిశీలించి తగిన సూచనలు అందించేవారని, ఇప్పుడు కళాశాలల నిర్వహణలో ప్రభుత్వానికి ప్రజల నుండి అనేక ఫిర్యాదులు రావడం వల్ల రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సభ్యులు ప్రత్యక్షంగా మెడికల్ కళాశాలను సందర్శించి కళాశాల లో వసతులు, సౌకర్యాలు, సిబ్బంది, నిర్వహణ పరమైన అన్ని విభాగాలను పరిశీలించి జిల్లా కమీటి ఆధ్వర్యంలో పరిశీలించిన విషయాలను అంతర్గత సమావేశం ద్వారా సమీక్షిస్తారు.గురువారం డి.ఎం.ఈ. రాష్ట్ర బృందం ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలోని అన్ని విభాగాధిపతులను కలిసి ఆ విభాగం ఎలా వుంది, విభాగ రూం, ఫర్నీచర్ మొదలైన వాటి పరిస్థితి ఎలా వుంది, తగినంత సిబ్బంది వున్నారా, వాటర్, ఎలక్ట్రీసిటీ, శానిటేషన్ విషయాలు అన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. కళాశాల ప్రిన్సిపాల్, ఇతర సిబ్బంది నుండి కూడా సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.వైద్య కళాశాలకు సంబంధించిన అన్ని వివరాలను కళాశాల ప్రిన్సిపాల్, బాధ్యతా యుతమైన ఇతర అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించగా, రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ బృందం తమ పరిశీలనలో వచ్చిన విషయాలను వివరించారు. మరిన్ని సదుపాయాల కోసం విస్తృతంగా చర్చించారు.రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ బృందంతో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. రాజేశ్వర్ రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డా. బి. కళావతి బాయి, ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డా. కిరణ్ కుమార్, ప్రభుత్వ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. సృజన తదితరులు వున్నారు.

Tags:

About The Author