బోనాలు ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీక*
లోకల్ గైడ్:
తెలంగాణ కుమ్మర్ల గోల్కొండ బోనాల ఉత్సవ సమితి అద్వైర్ర్యంలో జూన్ 26 నాడు గోల్కొండలో శ్రీశ్రీ శ్రీ జగథాంభిక అమ్మ వారికి బోనం దూప దీప నైవేద్యం సమర్పించే కార్యక్రమం జరిగింది. తెలంగాణ కుమ్మర్ల గోల్కొండ బోనాల ఉత్సవ సమితి నిర్వహించిన కుమ్మర్ల తొలి బోనాల జాతరలో బోనమెత్తిన తెలంగాణ కుమ్మర సంఘం 880/2014 రాష్ట్ర శాఖ అధ్యక్షులు నేదునూరి కనకయ్య గారి సతీమణి బెస్ట్ ఆర్టిస్టు అవార్డ్ గ్రహీత శ్రీమతి నేదునూరి సరిత కుమారి మాట్లాడుతూ తెలంగాణ సoస్కృతిసాంప్రదాయాలకు అద్దం పట్టే కుమ్మర్ల తోలిబొనాల పండుగ సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీక అని అమ్మ.వారి స్ఫూర్తితో మహిళలు అన్ని రంగాల్లో రాణించేట్లు శక్తి యుక్తులు సంతరించు కొని మహిళా సాధికారత సాధనకు మహిళా లోకం ఉద్యమించాలన్నారు. మహిళలు చట్టసభల్లో ప్రవేశించడానికి ముందుకు రావాలన్నారు . స్త్రీ పురుష సమానత్వ సాధనలో మహిళలు క్రియాశీలక భూమిక పోషించాలన్నారుకార్యక్రమంలో తెలంగాణ కుమ్మర సంఘం 880/2014 రాష్ట్ర శాఖ అధ్యక్షులు నేదునూరి కనకయ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ బోనాల పండుగ ప్రజారోగ్య సూత్రాలను పర్యావరణ స్పృహను సమాజంలో పెంచి కులాలకుప్రాంతాలకు పట్టణ పల్లెలకు అతీతంగా హిందువుల సాంస్కృతిక పునర్ వైభవాన్ని ప్రపంచానికి చాటె గొప్ప పండుగ అని అన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ మండలి తొలి చైర్మెన్ శ్రీ స్వామి గౌడ్ తెలంగాణ కుమ్మర్ల గోల్కొండ బోనాల ఉత్సవ సమితి కోశాధికారి సత్యనారాయణ ఎస్ శంకర్ కూచిపూడి డ్యాన్స్ లో గిన్నిస్ రికార్డ్ విజేత దామా హర్షిత,మహిళలు హాజరైనారు.తెలంగాణ కుమ్మర్ల గోల్కొండ పండుగ బోనాల ఉత్సవ సమితి కమిటీ ప్రధాన కార్యదర్శి కొల్లూరి అనిల్ కుమార్ సహాయ కార్యదర్శి కాకుకారం శంకర్ ఉత్సవ సమితి ఛైర్మెన్ వైస్ చైర్మన్ కోశాధికారి జాయింట్ సెక్రటరీ ఆర్గనైజర్ విజయ్ కుమార్ సి హెచ్ ప్రెంకుమర్ దామ సత్యనారాయణ రాంచందర్ కాకులారం కృష్ణ తెలంగాణ కుమ్మర్ల గోల్కొండ బోనాలఉత్సవ సమితిచైర్మన్ కాకులారం శంకర్ తదితరులు పాల్గొన్నారు.