ఆల్ ఇండియా స్టేట్ వెన్షనర్స్ ఫెడరేషన్ *
( రిజిస్టర్ నెంబర్. 1020/2016)
పెనిషనర్లపాలిటీ ఆశనిపాతం
జనగామ (లోకల్ గైడ్):-
జనగామ.2004 లో పాత పెన్షన్ పథకం స్థానంలో కొత్త పెన్షన్ పద్ధతి ప్రవేశపెట్టి పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే పెన్షన్ కు పెసర పెట్టే ప్రయత్నం చేసిన కేంద్ర ప్రభుత్వం మరొకసారి పెన్షనర్లపై కొరడా ఝలిపించింది. దేశవ్యాప్తంగా పెన్షనర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఒక ప్రభుత్వ సాధికారిక ప్రకటనను 2025 మార్చి చివరి వారంలో భారత పార్లమెంట్ ఆమోదించింది. ముందస్తు సమాచారము ఏమీ ఇవ్వకుండా ఫైనాన్స్ బిల్లులో చేర్చి అకస్మాత్తుగా మార్చనిల 25వ తేదీ నాడు లోక్సభలో ప్రవేశపెట్టబడిన ఆ బిల్లు చివరికి చట్ట రూపం దాల్చింది. ఈ చట్టం ప్రకారము కేంద్ర ప్రభుత్వం 1-1-2026 కు ముందు రిటైర్డ్ అయిన పెన్షనర్ల, 1-1-2026 తర్వాత రిటైర్డ్ అయిన పెన్షనర్లు అని రెండు వర్గాలుగా పెన్షనర్లను విభజించి 1-1-2026 తర్వాత పెన్షనర్లకు మాత్రమే నూతన వేతన సంఘం సిఫారసులను వర్తింపజేయవచ్చు ఆ అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం ద్వారా కైవసం చేసుకుంది. వేతన సంఘం సిఫారసులు ఏ తేదీ నుండి అమలు రావాలో,బకాయిలు చెల్లించాలా వద్దా అన్న నిర్ణయం కూడా ప్రభుత్వానిదే ఈ చట్టము డిఎస్ నకారా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధం .
ఇది పార్లమెంటులో చట్ట రూపం ధరించింది కాబట్టి, దేశంలోని అందరూ రిటైర్డ్ ఉద్యోగస్తుల పాలిటి ఆశనిపాతం కాబట్టి కూడా వివిధ రకాలైన పెన్షనర్ అసోసియేషన్ లందరూ కలిసి ఓకే జాక్ గా ఏర్పడి భారత ప్రధాని మోడీ కి తమ తమ జిల్లాలోని కలెక్టర్ల గార్ల ద్వారా నిరసన మెమోరాండంను సమర్పించినారు. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘ అధ్యక్షులు ఎన్ మహేందర్ రెడ్డి జిల్లా యూనిట్ అధ్యక్షులు కే మహబూబ్ రెడ్డి కార్యదర్శి జగదీశ్వర చారి మరియు కార్యవర్గ సభ్యులు శోభ హేమలత విమలాదేవి రాష్ట్ర మాజీ బాధ్యులు శ్రీ యాదవ రెడ్డి జిల్లా అసోసియేట్ అధ్యక్షులు శ్రీతమ్మిశెట్టి మల్లికార్జున్, కే బాలయ్య మాజీ అధ్యక్షుడు బిక్షపతి రామన్న రియాజ్ వి విజయకుమార్ అఫ్జల్ ప్రకాష్ దాదాపు 100 మంది పెన్షనర్స్ పాల్గొన్నారు.