ఫోన్ పే ద్వారా 17వేల రూపాయలకు టోకరా వేసిన కేటుగాడు...
లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించిన బాధితుడు...
కామారెడ్డి : (లోకల్ గైడ్) కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపు లో ఫోన్ పే మోసం జరిగింది..పెట్రోల్ పంపు లో ఒక యువకుడు మా కుటుంబీకులు హాస్పిటల్ లో ఉన్నారని ఆసుపత్రిలో డబ్బులు చెల్లించాల్సి ఉందని అందుకుగాను 17 వేలు క్యాష్ ఇవ్వండి అంటూ ఫోన్ పే చేస్తానని పెట్రోల్ పోసే యువకుడు భాస్కర్ ను అడగడంతో అతను స్పందించి అంతగా డబ్బు లేదని 9000 రూపాయలు మాత్రమే ఉన్నాయని ఫోన్ పే Qr కోడ్ ద్వారా డబ్బులు చెల్లించాలని కోరడంతో 9 వేలు క్యాష్ ఇచ్చాడు.QR కోడ్ కు డబ్బులు వెళ్లడం లేదని ఫోన్ నెంబర్ కు వేస్తానని భాస్కర్ వద్ద నెంబర్ తీసుకుని వేరే నెంబర్ కి వేసి సక్సెస్ ఫుల్ మేసేజ్ చూపించి అక్కడ నుండి ఫరార్ అయ్యాడు.కొద్ది సేపు తర్వాత ఫోన్ పే లొ డబ్బులు రాక పోవడంతో మోసపోయానని తెలుసుకున్న భాస్కర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.