వర్షాల కోసం ఆశగా అన్నదాతల ఎదురుచూపు
మహబూబాబాద్ (లోకల్ గైడ్){రుతుపవనాల ప్రభావం తో కురిసిన కొద్ది పాటి వర్షాలకి రైతులు తొందరగా దుక్కులు దున్ని విత్తనాలు వేసిన రైతుకు ఆతరువాత వర్షాలు లేక వేసిన విత్తనాలు మొలకెత్తక రైతులు ఆశగా మబ్బుల వైపు చూస్తున్నారు.
సాధారణంగా రోహిణి కార్తే లో రోళ్ళు పగిలి పోయె ఎండలు కొడతాయి, కానీ ఈసంవత్సరం అలా కాకుండా ఎండల తీవ్రత తక్కువగా ఉంది దానితో పాటు కురిసిన కొద్ది పాటి వర్షాలకు రైతులు ఆశగా ఈసారి ముందుగానే వర్షాలు కురిసే అవకాశం ఉందని తొందరగా వారి పంట చెనులను , చేలకలను దుక్కులు దున్ని చదును చేసి ఉంచుకున్నారు ,ఆతరువాత అధను చూసి పత్తి గింజలను,మొక్క జొన్న కూడా ఆశగా విత్తుకున్నారు,ఆతరువాత రైతులకు అసలు కష్టాలు మొదలైనాయి రుతుపవనాలు కదలిక లేకపోవడం మరియు వర్షాలు కురువకపోవడం వల్ల వేసిన పంటలు కూడా ఎండి పోయి కొద్ది మంది రైతులు పత్తి నీ చెడగొట్టి పెసర్లు వంటి పంటలను వేయడం తో పాటు మరికొద్ది మంది ఆశగా మళ్ళీ పత్తి గింజలను వేశారు అప్పటికి వర్షాలు లేకపోవడంతో అన్నదాతలు ఆశగా మబ్బుల వైపు చూస్తున్నారు.ఒకవైపు మాత్రం భావి పారకం తో కొంత మంది రైతులు పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇలానే వర్షాలు లేక పోతే తమ పరిస్థితి ఏంటని ,అన్నదాతలు తమ పంటలు ఎండి పోవలసినదేన అని తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.ఇకనైనా వరుణ దేవుడు కరుణించి వర్షాలు కురవాలని అన్నదాతలు కోరుకుంటున్నారు.