యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి: పోలీస్ కమిషనర్
లోకల్ గైడ్: ఖమ్మం:
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం,అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కారించుకొని నగరంలోని రిక్కబజార్ విద్యార్థులకు నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ ముఖ్యతిదిగా పాల్గోని స్కూల్ అవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ..సరదా కోసం మొదలైన అలవాటు.. మత్తులోకి నెడుతోందని, గతంలో సిగరెట్, మద్యంతో సరిపెట్టుకునే యువత.. ఇప్పుడు నిషా కోసం గంజాయి, మాదకద్రవ్యాల బారినపడి మత్తుకు బానిసలవుతున్నారని అన్నారు. సమాజంలోని మాదకద్రవ్యాల ముప్పును అంతం చేసే లక్ష్యంలో యువత భాగస్వామ్యం కావాలని అన్నారు.మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా నిర్మూలన కోసం నషాముక్త్ భారత్ అభియాన్ ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలకు నేటి యువత బానిసలై తమ ఉజ్జ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. యువత మాధకద్రవ్యాల బారిన పడకుండా ఉండేలా అన్ని పాఠశాలలు, కళాశాలల్లో మాదకద్రవ్యాల వినియోగం కారణంగా కలిగే దుష్ప్రభావాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మాదకద్రవ్యాల బానిసలై విముక్తిపొందిన వారితో మాదకద్రవ్యాల దుష్ప్రభావాలను గురించి తెలియజేసినట్లైతే , యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా రక్షించవచ్చన్నారు.యువత మాదకద్రవ్యాల వైపు మళ్లించకుండా ప్రకృతి వైపు మళ్ళిస్తే నాటిన ప్రతి మొక్క మన భవిష్యత్తుకు బాటాలు వెస్తాయని గుర్తుచేశారు.ఎవరైనా చెడు వ్యసనాలకి మారినట్లయితే తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్ బ్యూరో (TGANB) టోల్ ఫ్రీ నెంబర్ 1908, డయల్ 100 కానీ మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.కార్యక్రమంలో, ఖమ్మం Acp ఏసిపి రమణమూర్తి, టూ టౌన్ Ci బాలకృష్ణ , పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విశాంత మండల విద్యాశాఖ అధికారి శైలజ లక్ష్మీ పాఠశాల ఉపాధ్యాయులు కట్టా శేఖర్ రావు సుజాత ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.