జపాన్‌లో ట్విట్టర్ కిల్లర్‌కు మరణశిక్ష అమలు

జపాన్‌లో ట్విట్టర్ కిల్లర్‌కు మరణశిక్ష అమలు

లోక‌ల్ గైడ్: జపాన్‌ను ఒక్కసారిగా గజగజలాడించిన ‘ట్విట్టర్ కిల్లర్’కు ఇవాళ మరణశిక్షను అమలు చేశారు. 34ఏళ్ల టకాహిరో షిరాయిషి 2017లో 9 మంది, అందులో 8 మంది యువతులను హత్య చేసి దేశాన్ని కుదిపేశాడు. 2022లో అతనికి కోర్టు మరణశిక్ష విధించగా, చివరికి శిక్షను అమలు చేశారు.టకాహిరో ట్విట్టర్‌లో అకౌంటు పెట్టి, ఆత్మహత్య ఆలోచనలున్న వ్యక్తులతో పరిచయం పెంచుకుని, “నువ్వు చనిపోవాలనుకుంటే, సహాయం చేస్తా” అని నమ్మించి తన ఇంటికి రప్పించేవాడు. ఆపై వారిని మోసంగా హతమార్చేవాడు. దర్యాప్తులో అతను 15 నుంచి 26ఏళ్ల వయసున్న యువతులను ముఖ్యంగా టార్గెట్ చేసుకున్నట్టు తెలిసింది.2017 అక్టోబరులో ఓ అదృశ్యమైన వ్యక్తి కేసు విచారణలో జమా సిటీలో గుర్తు తెలియని శరీర భాగాలు లభ్యమయ్యాయి. పోలీసులు ఆచూకీตามించి టకాహిరో ఫ్లాట్‌లో తనిఖీ చేస్తే, టూల్ బాక్స్‌లలో, కూలర్లలో ముక్కలైన శరీర భాగాలను గుర్తించారు.తనకు మరణశిక్ష విధించవద్దని లాయర్లు వాదించారు. “బాధితులు బలవన్మరణానికి ఒప్పందమే” అని చెప్పారు. కానీ, ప్రాసిక్యూటర్లు “ఇది పద్ధతి ప్రకారం హత్య, ఉద్దేశపూర్వక క్రైమ్” అని వాదించడంతో చివరకు అతనికి డెత్ పెనాల్టీ ఖరారైంది. విచారణలో టకాహిరో “తానే చంపాడు” అని అంగీకరించాడు.

Tags:

About The Author

Latest News

హోంగార్డ్స్ విభాగానికి వులెన్ జాకెట్స్ ప్రధానం చేసిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య... హోంగార్డ్స్ విభాగానికి వులెన్ జాకెట్స్ ప్రధానం చేసిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య...
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి: (లోకల్ గైడ్) నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డ్స్ సిబ్బందికివర్షాకాలం మరియు చలికాలంలో విధుల నిర్వహణ కష్టం అవుతదన్న ముందు...
కీర్తి సురేష్ – సుహాస్ నటించిన "ఉప్పు కప్పురంబు" మ్యూజిక్ ఆల్బమ్ విడుదల 
వస్తున్నాయ్ వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు..! 
 భూత్పూర్ "మీ సేవా" కేంద్రంగా గూడుపుఠాణి.. ! 
పారిశుద్ధ్యం అస్తవ్యస్తం!
కృష్ణ గోదావరి నది జలాల లో న్యాయం జరిగే అంత వరకు పోరాటం.
స్రిజితా ఘోష్