పారిశుద్ధ్యం అస్తవ్యస్తం!
- ఇందూర్ గ్రామంలో పడకేసిన పారిశుధ్యం.
- పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవట్లేదు.
- మా దగ్గర పైసలు లేవు మేం చెయ్యం.
- ఏం చేసుకుంటారో చేసుకోపోండి అంటూ.
- పంచాయతీ కార్యదర్శి సమాధానం.
- ఆవేదన వ్యక్తం చేస్తున్న ఇందూరు గ్రామ ప్రజలు.
లోకల్ గైడ్/తాండూర్:
పెద్దేముల్ మండల పరిధిలోని ఇందూర్ గ్రామంలో, పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది.గ్రామంలో నిలువ ఉన్న పొడి చెత్తను తీసుకెళ్లడానికి....పంచాయతీ సిబ్బంది ఎవరు రావడంలేదని, స్థానికులు ఆరోపిస్తున్నారు. సుమారు 20 రోజుల నుండి చెత్తను సేకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దీంతో, దోమలు పెరిగి, స్థానికులు విష జ్వరాల బారిన పడుతున్నారని గ్రామ ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.చెత్తను తొలగించకపోవడం కాక,నెల రోజుల నుంచి గ్రామంలో మురుగు కాలువలో చెత్త,చెదారం పేరుకుపోయి నీరు వెళ్లలేక,చెత్త పైన దోమలు,ఈగలు వాలి మనుషులకు కాటేయడంతో, విష జ్వరాల బారిన పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గ్రామంలో ఎక్కడ చూసినా మురుగు కాలువలో చెత్త ఎక్కడికి ఎక్కడ పేరుకుపోయిందని, తద్వారా దుర్వాసన, దోమల బెడదను భరించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి బలరాం దృష్టికి తీసుకెళ్లగా,మేం చేయం, మాకు పైసలు వస్తలేవు, ఏం చేసుకుంటారో చేసుకోపోండి అంటూ గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు.సుమారు 20 రోజుల నుంచి చెత్త సేకరించకపోవడంతో, చెత్తను ఎక్కడంటే అక్కడ పడవేయడంతో, దుర్వాసనను,ఈగలు,దోమలు, పందులు,కుక్కల బెడదను భరించలేకపోతున్నామని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈగలు, దోమల వ్యాధులు సోకి ఆసుపత్రుల పాలు కావాలనా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే వర్షాకాలం దోమల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.ఇప్పటికైనా గ్రామపంచాయతీ సిబ్బంది గ్రామంలో ఉన్న చెత్తను తొలగించి,మురుగు కాలువలో...పేరుకుపోయిన వ్యర్ధాలను తొలగించి ప్రజల ప్రాణా కాపాడాలని గ్రామస్తులు అధికారులను వేడుకుంటున్నారు.
బెదిరింపులకు పాల్పడుతున్న కార్యదర్శి.
గ్రామంలో ఉన్న సమస్యల గురించి గ్రామంలోని పలువురు పంచాయతీ కార్యదర్శి బలరాం దృష్టికి తీసుకెళ్లగా, తమ దగ్గర ఎలాంటి బడ్జెట్ లేదు, మాకు ప్రభుత్వం పైసలు ఇస్తలేదు, మేము చేయము, ఏం చేసుకుంటారో చేసుకోపోండి, ఎవరికైనా చెప్పుకోండి అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.గ్రామ సమస్యల పట్ల కార్యదర్శి ఈ విధంగా సమాధానం ఇవ్వడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుందని స్థానికులు మండిపడుతున్నారు.ఇలాంటి కార్యదర్శి తమ గ్రామానికి వద్దని తక్షణమే పంచాయతీ కార్యదర్శి బలరాం పైన చర్యలు తీసుకొని, ఇక్కడి నుండి తొలగించాలని ఉన్నతాధికారులను ఇందూరు గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
కారోబార్ అత్యుత్సాహం!
గ్రామంలో ఉన్న సమస్యలను పంచాయతీ కార్యదర్శికి తెలిపే క్రమంలో, అన్ని తానై...అన్ని నాకే తెలుసు అన్నట్టు, పంచాయతీ కార్యాలయానికి వచ్చిన ప్రజల పైన కారోబార్ బాలరాజు దురుసుగా ప్రవర్తించడమే కాక, బెదిరింపులకు పాల్పడుతూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక, ప్రజా సమస్యల కోసం ప్రశ్నించే విలేకరులను సైతం బెదిరిస్తున్నట్లు స్థానికులు ఆందోళన చెందుతున్నారు.తక్షణమే ఉన్నత అధికారులు స్పందించి, పంచాయతీ కార్యదర్శి, కారోబార్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.సెక్రెటరీని వెంటనే సస్పెండ్ చేయాలి.
గ్రామంలో సుమారు నెల రోజుల నుంచి చెత్త తొలగించకపోవడంతో,ఎందుకు చెత్తను సేకరించడం లేదు అని కార్యదర్శిని అడిగేందుకు పంచాయతీ కార్యాలయానికి పలుమార్లు వెళితే, సరైన సమాధానం ఇవ్వకుండా... మా దగ్గర డబ్బులు లేవు, ట్రాక్టర్లో డీజిల్ వెయ్యాలంటే ప్రభుత్వం పైసలు ఇస్తలేదు. చెత్తను తొలగించడం కుదరదు. ఏం చేసుకుంటావో చేసుకో అని బెదిరిస్తున్నాడని గ్రామస్తులు తెలిపారు. ఇలాంటి కార్యదర్శిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
యాదప్ప ఇందూర్ గ్రామ వాసి.
దుర్వాసనను భరించలేకపోతున్నాం.
గ్రామంలో సుమారు నెల రోజులు గడుస్తున్న మరుగు కాలువలో చెత్తను తొలగించడం లేదు.దీంతో మోరిలో చెత్త ఎక్కడికి అక్కడ పేరుకుపోయి...దోమలు,ఈగలు వాలుతున్నాయి.ఈ నేపథ్యంలో దోమల కాటుకు గురై రోగాల బారిన పడే ప్రమాదం ఉంది.అధికారులు స్పందించి మురుగు కాలువలో చెత్తచెదారం తొలగించి ప్రాణాలు కాపాడాలని గ్రామ వాసి పెద్ద శేఖర్ అధికారులను కోరారు.
ఇందూరు గ్రామవాసి పెద్ద శేఖర్.