సచివాలయంలో మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ బాధ్యతలు ....
హైదరాబాద్:
సచివాలయంలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రి పదవిని చేపట్టారు. ఆయన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మరియు దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ, ‘‘ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, దివ్యాంగుల సంక్షేమం కోసం పూర్తి స్థాయిలో కృషి చేస్తాము’’ అని తెలిపారు.ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో గడ్డం వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్కి మంత్రిపదవులు లభించాయి. ఈ విస్తరణలో వాకిటి శ్రీహరి కి క్రీడలు, యువజన సర్వీసులు, పశుసంవర్ధక శాఖ, గడ్డం వివేక్ కు కార్మిక, గనుల శాఖలు కేటాయించబడ్డాయి. తాజా విస్తరణతో రాష్ట్ర కేబినెట్లో మంత్రుల సంఖ్య 15కి చేరింది. పాత మంత్రుల శాఖల్లో ఎలాంటి మార్పులు చేయకుండా, సీఎం వద్ద ఉన్న శాఖలను కొత్త మంత్రులకు అప్పగించారు.