సచివాలయంలో మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ బాధ్యతలు ....

సచివాలయంలో మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్  బాధ్యతలు ....

హైదరాబాద్‌:
సచివాలయంలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రి పదవిని చేపట్టారు. ఆయన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మరియు దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ, ‘‘ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, దివ్యాంగుల సంక్షేమం కోసం పూర్తి స్థాయిలో కృషి చేస్తాము’’ అని తెలిపారు.ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో గడ్డం వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్కి మంత్రిపదవులు లభించాయి. ఈ విస్తరణలో వాకిటి శ్రీహరి కి క్రీడలు, యువజన సర్వీసులు, పశుసంవర్ధక శాఖ, గడ్డం వివేక్ కు కార్మిక, గనుల శాఖలు కేటాయించబడ్డాయి. తాజా విస్తరణతో రాష్ట్ర కేబినెట్‌లో మంత్రుల సంఖ్య 15కి చేరింది. పాత మంత్రుల శాఖల్లో ఎలాంటి మార్పులు చేయకుండా, సీఎం వద్ద ఉన్న శాఖలను కొత్త మంత్రులకు అప్పగించారు.

Tags:

About The Author

Advertisement

Latest News

సంపూర్ణ ఆరోగ్యానికి ప్రాచీన దివ్యా ఔషధం యోగా... సంపూర్ణ ఆరోగ్యానికి ప్రాచీన దివ్యా ఔషధం యోగా...
  ప్రతిరోజు యోగా చేయడం మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది... జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మి... నిజామాబాద్,(లోకల్ గైడ్) నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో గల
యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం..
పిజెఆర్ స్టేడియంలో ఘనంగా యోగా దినోత్సవం...
రైళ్లలో సెల్ ఫోన్లు చోరీ చేసే దొంగ అరెస్ట్...
ఆరోగ్యకర జీవితానికి ప్రధాన సూత్రం యోగ 
యోగ సాధనతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం 
సంపూర్ణ ఆరోగ్యం యోగాతోనే సాధ్యం... ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ...