రైళ్లలో సెల్ ఫోన్లు చోరీ చేసే దొంగ అరెస్ట్...
రైల్వే ఎస్సై సాయి రెడ్డి వెల్లడి....
నిజామాబాద్ :(లోకల్ గైడ్)
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ లో తెల్లవారుజామున అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ద్వారక నగర్ ప్రాంతానికి చెందిన సయ్యద్ మాజీద్ అనే యువకుడిగా గుర్తించినట్టు రైల్వే ఎస్సై సాయి రెడ్డి తెలిపారు... నిందితుని వద్ద మూడు మొబైల్ ఫోన్లు లభ్యమైనట్టు తెలిపారు.. అయితే నిందితుని నుండి విచారించగా తరచూ రైలులో దొంగతనాలకు పాల్పడే వాడిగా గుర్తించినట్టు చెప్పారు.. ఈనెల 19వ తేదీ సైతం చోరీకి పాల్పడ్డట్టు మరల సెల్ఫోన్లు చోరీ చేసేందుకు రావడం జరిగిందన్నారు.. నిందితుడు సయ్యద్ మజీద్ కదలికను రైల్వే పోలీసులు గమనించి పట్టుకోవడం జరిగిందన్నారు.. నిందితునిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి కోర్టు నందు హాజరుపరచడం జరిగిందన్నారు. ఇతనిని గమనించి చాక చక్యంగా పట్టుకున్న సిబ్బంది సురేందర్ హెడ్ కానిస్టేబుల్ మరియు గురూదాస్ అలాగే రాములు లను అభినందించారు..