విద్యుత్ సరఫరా అన్ని వర్గాల ప్రజలకు నిరంతరాయంగా అందించాలి.జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష*
విద్యుత్ శాఖ పై సమీక్ష చేసిన జిల్లా కలెక్టర్
పెద్దపల్లి,లోకల్ గైడ్
జిల్లాలో అన్ని వర్గాల ప్రజలకు విద్యుత్ సరఫరా నిరంతరాయంగా అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష విద్యుత్ శాఖ పని తీరు పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, వర్షాకాలంలో విద్యుత్ సరఫరా అంతరాయం కల్గకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో 7 సబ్ డివిజన్ పరిధిలో అవసరమైన మేర విద్యుత్ పోల్స్ అందుబాటులో పెట్టుకోవాలని అన్నారు. లైన్ మేన్ అప్రమత్తంగా ఉంటూ ఎక్కడైనా విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్దరించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.జిల్లాలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా లూజ్ వైర్లను టైట్ చేయాలని అన్నారు. జిల్లాలోని ఒక మండలాన్ని ఎంపిక చేసుకొని, అందులో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఇండ్ల పై నుంచి వెళ్ళే హై టెన్షన్ వైర్ల తరలింపు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అన్నారు. ఈ సమావేశంలో ఎస్.ఈ ఎన్.పి.డి.సి.ఎల్ మాధవ రావు, డీఈ లు,సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.