పిజెఆర్ స్టేడియంలో ఘనంగా యోగా దినోత్సవం...

పిజెఆర్ స్టేడియంలో ఘనంగా యోగా దినోత్సవం...

లోకల్ గైడ్ శేరిలింగంపల్లి: చందానగర్ లోని పి జె ఆర్ స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం శనివారం ఘనంగా జరిగింది. పతాంజలి యోగ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలో పెద్ద సంఖ్యలో యోగ అభ్యాసకులు పాల్గొని యోగ ప్రోటోకాల్ ను పాటించారు. ఈ సందర్భంగా యోగా శిక్షకులు పుట్ట వినయకుమార్ గౌడ్, తరిగొప్పుల స్వేత, జగన్నాథం, బోనకుర్తి విఠల్ లను అభ్యాసకులు ఘనంగా సన్మనించారు. అనంతరం వారు మాట్లాడుతూ యోగ అంటే వ్యాయామ ప్రక్రియ మాత్రమే కాదని అదొక జీవన విదానమని అన్నారు. ప్రాపంచిక ఆందోళనలను తగ్గించి మనిషికి ప్రశాంతతను ప్రసాదించే దివ్య ఔషదం యోగ అని అన్నారు. మనిషి ఆయుష్షును పెంచే సాధన ఏదైన ఉందంటే అది యోగా మాత్రమేనని అన్నారు. అనారోగ్యాల బారిన పడకుండా ముందే అప్రమత్తం అవ్వాలని, అందుకు నిత్యం యోగానే శరణ్యమని అన్నారు. ఈ నేపథ్యంలో పలువురు చిన్నారులు యోగా విన్యాసలతో ఆకట్టుకున్నారు.

Tags:

About The Author

Advertisement

Latest News

సంపూర్ణ ఆరోగ్యానికి ప్రాచీన దివ్యా ఔషధం యోగా... సంపూర్ణ ఆరోగ్యానికి ప్రాచీన దివ్యా ఔషధం యోగా...
  ప్రతిరోజు యోగా చేయడం మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది... జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మి... నిజామాబాద్,(లోకల్ గైడ్) నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో గల
యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం..
పిజెఆర్ స్టేడియంలో ఘనంగా యోగా దినోత్సవం...
రైళ్లలో సెల్ ఫోన్లు చోరీ చేసే దొంగ అరెస్ట్...
ఆరోగ్యకర జీవితానికి ప్రధాన సూత్రం యోగ 
యోగ సాధనతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం 
సంపూర్ణ ఆరోగ్యం యోగాతోనే సాధ్యం... ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ...