యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం..
పోచారం ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపాల్ కొలిపాక బాలరాజు
లోకల్ గైడ్:
ప్రస్తుత పరిస్థితులలో యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని పోచారం ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపాల్ కొలిపాక బాలరాజు అన్నారు. యోగ అంటే మనసును శరీరాన్ని కలపడం అని అదేవిధంగా యోగా అంటే జీవనశైలిలో మార్పు చేసుకోవడం అని ప్రతి మనిషి యొక్క ఆలోచనపైనే వారి యొక్క జీవన విధానం ఆధారపడి ఉంటుందని సృష్టి ఎప్పుడూ మారదని ప్రతి మనిషి తను చూసేటువంటి దృష్టి కోణాన్ని మార్చుకోవాలని, ఇప్పుడున్న పరిస్థితులలో ప్రతి మనిషి తన దైనందిన జీవితంలో డబ్బే పరమావధిగా జీవించడం జరుగుతుంది.అలా కాకుండా ఆరోగ్యం పరమావధిగా జీవించాలని, ఆరోగ్యంగా ఉన్నప్పుడే అన్నీ చేయడం సాధ్యమవుతుందని అన్నారు. ప్రత్యేకంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున పాఠశాలలో ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో పిల్లలకు యోగ యొక్క విశిష్టతను ఆసనాల యొక్క ప్రాముఖ్యతను వివరించడం జరిగింది. ప్రాణాయామం ఆసనాలు మరియు మెడిటేషన్ చేయించడం జరిగింది.యోగాతో శారీరక ఆరోగ్యంతో పాటుగా మానసిక ఆరోగ్యం వస్తుందని మనిషి ఎప్పుడైతే మానసికంగా దృఢంగా ఉంటాడో అప్పుడే శారీరక దృఢత్వం సాధ్యమవుతుంది అని అన్నారు. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు చెబుతుంటారు అని గుర్తు చేశారు. ఆధ్యాత్మికంగా జీవాత్మను పరమాత్మలో కలపడం యోగ అంటారని వివరించడం జరిగింది.పిల్లల చేత పద్మాసనం, వజ్రాసనం, మండూకాసనం, శలభాసనం ,వృక్షాసనం, గోముఖాసనం,హలాసనం,శవాసనం లాంటి ఆసనాలతో పాటుగా సూర్య నమస్కారాలు,నాడీ శోధన, బస్తరిక, కపాల బాతి లాంటి ప్రాణాయామాలు మరియు వివిధ రకాల ఎక్సర్సైజులు చేపిస్తూ వాటి యొక్క ప్రాముఖ్యతను వివరించడం జరిగింది.