ప్రజావాణి కార్యక్రమానికి 72  పిర్యాదులు

ప్రజావాణి కార్యక్రమానికి 72  పిర్యాదులు

ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలి,
  నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ,
లోకల్ గైడ్ నాగర్ కర్నూల్ జిల్లా   
ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి క్షేత్ర స్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ , సంబంధిత అధికారులను ఆదేశించారు.సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి పిర్యాదులు, వినతులను అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవ సహాయం, తో కలిసి  జిల్లా కలెక్టర్ స్వయంగా స్వీకరించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ ………    సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి వస్తారని, అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. అర్జీలను  ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాగా ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 72  పిర్యాదులు, వినతులు వచ్చాయని, వాటిని వెంటనే సంబంధిత అధికారులను పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వివిధ జిల్లా అధికారులు,తహసీల్దర్లు,కలెక్టరేట్ పర్యవేక్షకులు,సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Advertisement

Latest News

మాలిక సదుపాయాల్లో నిర్లక్ష్యంగా వహిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదు... మాలిక సదుపాయాల్లో నిర్లక్ష్యంగా వహిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదు...
సారంగాపూర్ ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ న్యాయమూర్తి ఉదయ భాస్కర్ రావు... 
సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ, శాంతి టాకీస్ '3 BHK' నుంచి సెకండ్ సింగిల్ ఆగిపోను నేను సాంగ్ రిలీజ్
పరమపద సోపానం' పూరి గారి స్టయిల్లో ఉంటుంది.. కచ్చితంగా మంచి విజయాన్ని అందుకుంటుంది : అర్జున్ అంబటి 
విజయ్ ఆంటోనీ ‘మార్గన్’ నుంచి ‘సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్
హెడింగ్లే టెస్టులో భారత్‌ దూకుడు..
తెలంగాణకు మరో ఐదు రోజులు వర్షాలే!
ఒలంపిక్ డే రన్ ప్రారంభించిన భువనగిరి అదనపు కలెక్టర్