గోదావరి పుష్కరాలపై మంత్రి వర్గ ఉపసంఘం, ప్రభుత్వ ఉత్తర్వులు....
By Ram Reddy
On
లోకల్ గైడ్, అమరావతి: 2027లో నిర్వహించనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ముఖ్య కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉపసంఘంలో మొత్తం 12 మంది మంత్రులు సభ్యులుగా నియమితులయ్యారు.ఈ కమిటీలో ఆనం రామనారాయణరెడ్డి, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, పొంగూరు నారాయణ, కందుల దుర్గేష్, వాసంశెట్టి సుభాష్, రాంప్రసాద్ రెడ్డి, సత్యకుమార్ యాదవ్, బీసీ జనార్ధన్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, పయ్యావుల కేశవ్ ఉన్నారు.పుష్కరాల నిర్వహణను విజయవంతం చేయడానికి అవసరమైన కార్యాచరణను ఈ ఉపసంఘం రూపొందించనుంది. సంబంధిత శాఖల అధికారులు ఉపసంఘానికి పూర్తిగా సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
Tags:
About The Author
Latest News
25 Jun 2025 17:14:26
ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టులో ద్విశతకంతో ఆకట్టుకున్న టీమ్ ఇండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్, ఐసీసీ టెస్ట్ బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో అత్యుత్తమంగా ఏడో స్థానానికి...