ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల
ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టులో ద్విశతకంతో ఆకట్టుకున్న టీమ్ ఇండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్, ఐసీసీ టెస్ట్ బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో అత్యుత్తమంగా ఏడో స్థానానికి చేరుకున్నాడు. లీడ్స్ వేదికగా జరిగిన మ్యాచ్లో పంత్ రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు (134, 118) బాదడం విశేషం. టెస్టుల్లో ఒకే మ్యాచ్లో రెండు సెంచరీలు చేసిన రెండో వికెట్ కీపర్గా పంత్ రికార్డు సృష్టించాడు. ఇదివరకూ ఈ ఘనత జింబాబ్వేకి చెందిన ఆండీ ఫ్లవర్ మాత్రమే సాధించాడు.అదే మ్యాచ్లో సెంచరీతో మెరిసిన టీమ్ఇండియా కెప్టెన్ శుభ్మాన్ గిల్ ఐదు స్థానాలు ఎగబాకి టాప్-20లో స్థానం దక్కించుకున్నాడు. ఇక భారత్ తరఫున టాప్ 20లో ఉన్న మూడో బ్యాట్స్మెన్ యశస్వి జైస్వాల్ — నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.టెస్ట్ బౌలర్ల జాబితాలో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన అగ్రస్థానాన్ని నిలుపుకున్నాడు. లీడ్స్ టెస్టులో మరోసారి ఐదు వికెట్లు తీసి 14వసారి ఈ ఫీట్ను నమోదు చేశాడు.ఇంగ్లండ్ విజయంలో కీలకంగా నిలిచిన బెన్ డకెట్ (149 పరుగులు, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్) ఐదు ర్యాంకులు ఎగబాకి ఎనిమిదో స్థానానికి చేరాడు. అదే విధంగా ఓలీ పోప్ 19వ స్థానానికి, జామీ స్మిత్ 27వ స్థానానికి ఎదిగారు. జో రూట్ టాప్ బ్యాట్స్మెన్గా కొనసాగుతున్నాడు. హ్యారీ బ్రూక్ రెండో స్థానంలో, కేన్ విలియమ్సన్ మూడో స్థానంలో ఉన్నారు.ఆల్రౌండర్ల విభాగంలో భారత్ ఆటగాడు రవీంద్ర జడేజా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. లీడ్స్ టెస్టులో బాల్తో, బ్యాట్తో మెరిసిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మూడు స్థానాలు మెరుగుపరుచుకొని ఐదో స్థానానికి చేరాడు.ఇక శ్రీలంక–బంగ్లాదేశ్ మధ్య జరిగిన తొలి టెస్ట్ డ్రాగా ముగియగా, 163 పరుగులు చేసిన ముష్ఫికుర్ రహీమ్ 11 ర్యాంకులు ఎగబాకి 28వ స్థానానికి చేరాడు. అదే మ్యాచ్లో రెండు సెంచరీలు చేసిన నజ్ముల్ హొస్సేన్ శాంటో 21 ర్యాంకులు ఎగబాకి 29వ స్థానానికి చేరాడు.