– స్కూల్ ఆవరణలో పేలుడు, తొక్కిసలాటలో 29 మంది చిన్నారులు మృతి
లోకల్ గైడ్,
బంగూయ్ (సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్): సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ రాజధాని
బంగూయ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
బార్తెలెమీ బోగాండా ఉన్నత పాఠశాల (Barthelemy Boganda High School) ఆవరణలో
విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పేలడంతో పాఠశాలలో
తొక్కిసలాట ఏర్పడి, దురదృష్టవశాత్తు
29 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.ఈ ఘటన గురువారం చోటు చేసుకోగా,
అదే సమయంలో విద్యుత్ శాఖ అధికారులు ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులు చేపడుతున్నట్లు
విద్యా మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. పాఠశాల ఆవరణలో ఒక్కసారిగా
పెద్ద శబ్దంతో పేలుడు సంభవించడంతో, విద్యార్థుల్లో గందరగోళం చెలరేగి, తీవ్ర తొక్కిసలాట చోటు చేసుకుంది.అందులో
260 మందికిపైగా విద్యార్థులు గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నారని, ప్రస్తుతం
వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.ప్రస్తుతం ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు. తల్లిదండ్రులు, స్థానికులు ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాసంస్థల్లో భద్రతపై మరింత జాగ్రత్తలు తీసుకోవాలని పౌర సమాజం డిమాండ్ చేస్తోంది.