మైనర్ పిల్లలను పనిలో పెట్టుకుంటే చట్ట ప్రకారం కఠినమైన చర్యలు 

మైనర్ పిల్లలను పనిలో పెట్టుకుంటే చట్ట ప్రకారం కఠినమైన చర్యలు 

 అదనపు ఎస్పీ శ్రీ పి.వి. మురళీధర్

వికారాబాద్ జిల్లా, లోకల్ గైడ్:

     తెలంగాణ రాష్ట్ర పోలీస్ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో ఈ రోజు ఆపరేషన్ ముస్కాన్-XIపై రాష్ట్ర స్థాయి ఆన్‌లైన్ సమావేశం నిర్వహించబడింది. జిల్లా ఎస్పీ శ్రీ కె.నారాయణ రెడ్డి, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, జిల్లా డి‌టి‌సి అదనపు ఎస్పీ శ్రీ పి.‌వి మురళీధర్  వివిధ శాఖల అధికారులతో కలిసి జిల్లా పోలీస్ కార్యాలయం లోని కాన్ఫరెన్స్ హాల్ నుండి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా అదనపు ఎస్పీ  మాట్లాడుతూ, జూలై 1వ తేదీ నుండి ఆపరేషన్ ముస్కాన్-9 ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అన్ని డిపార్ట్‌మెంట్ల అధికారులు సమన్వయంతో పనిచేసి ఆపరేషన్ ముస్కాన్‌ను విజయవంతం చేయాలని ఆయన సూచించారు.జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో కార్మిక, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, పోలీస్, బాలల సంక్షేమ సమితి, రెవెన్యూ, విద్య, పంచాయతీ రాజ్ మరియు ఆరోగ్య శాఖల అధికారులతో నిర్వహించిన  సమావేశంలో ఆయన మాట్లాడారు. తప్పిపోయిన పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చాలని, బాల్యవివాహాలను అరికట్టాలని, పిల్లలతో భిక్షాటన చేయకుండా చూడాలని ఆయన తెలిపినారు. ప్రమాదకరమైన కర్మాగారాలలో పిల్లలతో వెట్టిచాకిరీ చేయించడం చట్టరీత్యా నేరమని, బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఆయన స్పష్టం చేశారు.బడీడు పిల్లలను చదువుకోనివ్వాలని, చదువుకోని వీధి బాలలను రక్షించాలని, రోడ్డుమీద కాగితాలు మరియు ప్లాస్టిక్ వస్తువులను ఏరుకునే పిల్లలను కాపాడాలని అదనపు ఎస్పీ గారు కోరారు. వారిని బాలల సంక్షేమ సమితి ముందు హాజరుపరిచి కౌన్సెలింగ్ ఇప్పించాలని, వారందరూ చదువుకునే విధంగా పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. మానవ అక్రమ రవాణాను నిరోధించడంపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ఆపరేషన్ ముస్కాన్-XI కోసం  ఏ హెచ్ టి యు ఇంచార్జ్ ఇన్‌స్పెక్టర్ షేక్ అన్వర్ పాషా ఆద్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ బృందాలు జిల్లా అంతటా నిరంతరం తిరుగుతూ పిల్లలతో పనిచేయించుకునే వారిని గుర్తిస్తాయని, వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని జిల్లా అదనపు ఎస్పీ గారు తెలిపారు.ఈ కార్యక్రమంలో  సీడబ్ల్యుసి చైర్ పర్సన్ వెంకటేశం మెంబర్లు ప్రకాష్, సంగమేశ్వర్,బి ఆర్ బి కో ఇంచార్జి కాంతారావు,డీసీపు శ్రీకాంత్,నరేష్ కుమార్,చైల్డ్ లైన్ రాజునాయక్,సంతోష్ రెడ్డి ఏ ఎల్ వో , యశోద సఖి సెంటర్ ఇంచార్జి,అంకిత,సాధన,హెల్ప్ అల్ సొసైటీ ఎన్జీవో లు, ముస్కాన్ టీం ఎస్సైలు & సభ్యులు మరియు ఎ హెచ్ టియు టీం తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

బీసీల అందరం కలిసికట్టుగా ఉంటే మన రాజ్యాధికారం మనమే పాలించవచ్చు బీసీల అందరం కలిసికట్టుగా ఉంటే మన రాజ్యాధికారం మనమే పాలించవచ్చు
బీసీ రాజాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సురేష్ దాస్ 
పూరిజగన్నాథున్ని దర్శించుకున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ 
మైనర్ పిల్లలను పనిలో పెట్టుకుంటే చట్ట ప్రకారం కఠినమైన చర్యలు 
ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇచ్చేందుకు "తమ్ముడు" మూవీకి సెన్సార్ నుంచి 'ఎ' సర్టిఫికెట్ తీసుకున్న ప్రొడ్యూసర్ దిల్ రాజు
అనంతపురంలో భారీ పరిశ్రమకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
గుంటూరులో పోలీసు ఏఐ హ్యాకథాన్‌కు సీఎం చంద్రబాబు ప్రారంభం
జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలసిన మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ శ్యాం బాబు...