రీషీ క్లినిక్స్ లో ప్రపంచ స్థాయి టెక్నాలజీతో వెల్నెస్ సేవలు ప్రారంభం
లోకల్ గైడ్, హైదరాబాద్: నల్లగండ్లలో ఏర్పాటు చేసిన రిషీ క్లినిక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని కేంద్ర మంత్రి శ్రీ రాందాసు అథవాలే మాట్లాడుతూ, ముందుగా రుషి క్లినిక్ యాజమాన్యాన్ని అభినందిస్తూ ఇలాంటి "నైపుణ్యం ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇంటికే పరిమితమవుతున్న మహిళలకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందిస్తోంది. చిన్న చిన్న వ్యాపారాలకు లోన్లు మంజూరు చేస్తూ, మహిళలను గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో భాగంగా ముందుకు తీసుకెళ్లే చర్యలు తీసుకుంటున్నాం" అని వివరించారు.
తెలంగాణను ఆరోగ్య సంరక్షణ, వెల్నెస్ రంగాలలో దేశానికే మార్గదర్శిగా నిలబెట్టే లక్ష్యంతో, రీషీ క్లినిక్స్ అత్యాధునిక ప్రపంచ సాంకేతికత ఆధారిత సేవల ద్వారా వినూత్న మార్గాలను సృష్టిస్తోంది.
సీఈఓ డాక్టర్ గాలివరపు దివ్య మాట్లాడుతూ: “మేము అందిస్తున్న సేవల ద్వారా ప్రతి వ్యక్తిలో స్వస్థతను, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో పని చేస్తున్నాం. దేశ విదేశాల్లో పరీక్షించబడిన అత్యుత్తమ టెక్నాలజీ ఇప్పుడు మన తెలంగాణలో అందుబాటులో ఉంది,” అన్నారు.
హెచ్ఐఎఫ్ యు ఇన్స్టంట్ స్కిన్ ఫర్మింగ్ , సోప్రానో లేజర్ హెయిర్ రిడక్షన్, పికో లేజర్ టాటూ రిమూవల్, ఎలక్ట్రోలిసిస్ వైట్ హెయిర్ రిమూవల్, సిఒ2 పిగ్మెంటేషన్ రిమూవల్, శరీర రంగు మెరుగుదల, గ్లో & టైటెనింగ్ కోసం క్యాప్సూల్ బెడ్ , డయోడ్ లేజర్ & ఫేస్ ఫర్మింగ్ మెషీన్లు, తక్షణ బరువు తగ్గడం మరియు శరీర స్లిమ్మింగ్ ట్రీట్మెంట్లు, జుట్టు తిరిగి పెరిగే చికిత్సలు,ఈ సేవల ద్వారా రీషీ క్లినిక్స్ వెల్నెస్ రంగంలో ఒక వినూత్న అధ్యాయానికి నాంది పలుకుతోందని తెలిపారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రమంత్రి వర్యులు దామోదర్ రాజనర్సింహ, మంత్రి దన్సరి అనసూయ( సీతక్క) , మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , స్థానిక ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, ఆర్పిఐ జాతీయ సెక్రెటరీ పేరం నాగేశ్వరరావు, గచ్చిబౌలీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి,జెఎంజి మీడియా అధినేత జగన్నాథం మాదిరెడ్డి, రిషీ క్లినిక్ సిఈఒ డాక్టర్ గాలివారపు దివ్యచందన, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రుసెంద్ర కుమార్, డెర్మటాలజీ నిపుణులు డా. వేదావతి,ఆర్పిఐ నాయకులు రవికుమార్, గోరఖ్ సింగ్, జాన్ మాస్ ప్రబుదాస్ తదితరులు పాల్గొన్నారు.