జమ్ముకశ్మీర్ నుంచి న్యూయార్క్ వరకు యోగా ఉత్సాహం!
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచం మొత్తం ఉత్సాహంగా జరుపుకుంటోంది. జమ్ముకశ్మీర్ నుంచి టోక్యో, న్యూయార్క్ వరకు ప్రతీ చోటా యోగాసనాల్లో మునిగిపోయిన ప్రజలతో సందడి వాతావరణం నెలకొంది. ప్రధాని నరేంద్ర మోడీ విశాఖపట్టణంలో నిర్వహించిన ‘యోగాంధ్ర’ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డెహ్రాడూన్లో యోగా దినోత్సవం సందర్భంగా యోగాసనాలు వేశారు.జపాన్ ప్రధాని భార్య యోషికో ఇషిబా టోక్యోలో వేలాదిమందితో కలిసి యోగా చేశారు. న్యూయార్క్లోని టైమ్స్ స్క్వేర్లో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ యోగా చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు.సరిహద్దుల్లో విధులు నిర్వర్తించే సైనికులు కూడా ఈ వేడుకల్లో భాగం అయ్యారు. బీఎస్ఎఫ్ జవాన్లు అమృత్సర్ అట్టారీ సరిహద్దులో యోగాసనాలు వేయడం విశేషం. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా యోగా చేస్తూ శాంతిని విస్తరించారు.
ప్రధాని మోడీ శాంతి సందేశం
విశాఖ సాగరతీరంలో ‘ఒకే భూమి.. ఒకే ఆరోగ్యం కోసం యోగా’ అనే కాన్సెప్ట్తో జరిగిన కార్యక్రమంలో మోడీ మాట్లాడారు. ‘‘యోగా అన్ని వయసుల వారికి అవసరం. దేశం, విదేశం అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ యోగా చేయాలి. మనకు లభించే అంతరంగిక శాంతి అంతర్జాతీయ స్థాయికి మార్గం కల్పిస్తుంది’’ అని ప్రధాని వివరించారు.