యోగా దినోత్సవంలో యోగాంధ్ర-2025కి గిన్నిస్ రికార్డు !

యోగా దినోత్సవంలో యోగాంధ్ర-2025కి గిన్నిస్ రికార్డు !

11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర-2025 కార్యక్రమం గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. విశాఖపట్నంలోని రామకృష్ణ బీచ్ నుంచి భీమిలి వరకు నిర్వహించిన ఈ ఘన వేడుకలో 3 లక్షల మందికిపైగా ప్రజలు పాల్గొని చరిత్ర సృష్టించారు. దీనితో, 2023లో గుజరాత్‌లోని సూరత్‌లో జరిగిన యోగా కార్యక్రమం (1,53,000 మంది పాల్గొన్నది) సృష్టించిన రికార్డును యోగాంధ్ర అధిగమించింది. లక్షలాది మంది ఒకే సమయంలో, ఒకే మార్గంలో యోగాసనాలు వేసి ఈ అరుదైన ఘనతను సాధించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మరింత వైభవంగా మార్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విజయంతో దేశానికి గర్వకారణంగా నిలిచింది.

Tags:

About The Author

Advertisement

Latest News

సంపూర్ణ ఆరోగ్యానికి ప్రాచీన దివ్యా ఔషధం యోగా... సంపూర్ణ ఆరోగ్యానికి ప్రాచీన దివ్యా ఔషధం యోగా...
  ప్రతిరోజు యోగా చేయడం మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది... జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మి... నిజామాబాద్,(లోకల్ గైడ్) నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో గల
యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం..
పిజెఆర్ స్టేడియంలో ఘనంగా యోగా దినోత్సవం...
రైళ్లలో సెల్ ఫోన్లు చోరీ చేసే దొంగ అరెస్ట్...
ఆరోగ్యకర జీవితానికి ప్రధాన సూత్రం యోగ 
యోగ సాధనతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం 
సంపూర్ణ ఆరోగ్యం యోగాతోనే సాధ్యం... ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ...