నేటి నుంచి జులై 15 వరకూ.. అంతర్జాతీయ రూట్లలో సర్వీసులు నిలిపివేేేేత
టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిర్ ఇండియా సమస్యల్లో చిక్కుకుపోయింది. ఇటీవల జరిగిన విమాన ప్రమాదం ఘటన మరువకముందే, ఈ ఎయిర్లైన్కి చెందిన పలు విమానాల్లో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నట్టు బయటపడింది. ఈ పరిణామాల నేపథ్యంలో సంస్థ తన విమానాల రక్షణ తనిఖీలు ముమ్మరం చేసింది.ఇక నిర్వహణ సమస్యల కారణంగా జాతీయ, అంతర్జాతీయంగా పలు సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేయాలని ఎయిర్ ఇండియా నిర్ణయించింది. ఇప్పటికే వైడ్బాడీ విమానాల కార్యకలాపాలను జూలై మధ్య వరకు సుమారుగా 15% వరకు తగ్గించనున్నట్టు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.దీని ప్రకారం, జూన్ 21 నుంచి జూలై 15 వరకు ఉత్తర అమెరికా, యూకే, యూరప్, ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియా మార్గాల్లో 16 అంతర్జాతీయ రూట్లలో సర్వీసులను తగ్గిస్తున్నట్టు ఎయిర్ ఇండియా వెల్లడించింది. ఈ ప్రభావిత మార్గాల్లో గోవా(మోపా)-లండన్(గాత్విక్) AI145/146 సర్వీసు కూడా ఉంది, ఇది సాధారణంగా వారానికి మూడుసార్లు నడుస్తుంది.