యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం...
ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా జీవించడానికి యోగా సాధనంగా ఉపయోగపడుతుంది. ఈ నెల 26వ తేదిన నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనాలని ఆరోగ్య రక్ష ఇందూర్ యువత అసోసియేషన్ పిలుపు...
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి: (నక్క రాకేష్)....
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆరోగ్య రక్ష కేంద్రం నందు ఈ నెల 26వ తేదిన ఆరోగ్యరక్ష మరియు ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా ప్రజల్లో యోగా పై మరింత అవగాహన కల్పించే విధంగా పలు కార్యక్రమాలను నిర్వహించటం జరుగుతుందన్నారు..ఈ సందర్భంగా పోస్టర్లను ఆవిష్కరించారు.. అనంతరం ఆరోగ్యరక్ష నిర్వహుకురాలు డాక్టర్ ఐశ్వర్య మాట్లాడుతూ యోగా సాధనతో మానసిక ,శారిరక సమస్యలను పూర్తిగా అధిగమించవచ్చన్నారు..
మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇందూరు యువత అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు కార్యదర్శి వాలా బాలకిషన్ మరియు సూజాత రెడ్డి, మద్ది గంగాధర్, డాన్స్ మాస్టర్ వినయ్ తదితరులు పాల్గొన్నారు..