టి జి ఎస్ సి ఎస్ సి ఆధ్వర్యంలో సివిల్ సర్వీసులో ఉచిత శిక్షణ కరపత్రాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే నాగరాజు
- ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ పేద విద్యార్థులు సివిల్ సర్వీసులో ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు
వరంగల్ (లోకల్ గైడ్ ): హన్మకొండ సుబేదారి లోని ఎమ్మెల్యే నివాస క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ పేద విద్యార్థులకు టి జి ఎస్ సి ఎస్ సి వారి ఆధ్వర్యంలో సివిల్ సర్వీస్ లో ఉచిత శిక్షణ అందిస్తున్న సందర్భంగా బుధవారం రోజున వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ షెడ్యుల్డ్ కులాల అభివృద్ధి సంస్థ అధ్యయన కేంద్రం బంజార హిల్స్ రోడ్ నెం 14 కె.బి.ఆర్ పార్క్ కు ఎదురుగా, హైదరాబాద్ నందు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (యు.పి.ఎస్.సి) సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (సి.యస్.ఎ.టి) 2025-26 విద్యా సంవత్సరం ప్రవేశానికి సంబంధించి నిర్వహించే ప్రిలిమినరీ పరీక్షలకు చెందిన నిరుద్యోగులైన, అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ వర్గాల వారు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ ఉత్తీర్ణులై వార్షిక ఆదాయం ౩ లక్షలు మించకుండా ఉన్నటువంటి వారు http://tsstudycircle.co.in వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో మాత్రమే జులై 7 వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్దులకు జూలై 13న ఎంపిక పరీక్షా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ ప్రవేశ పరీక్షలో పొందిన మెరిట్ ఆధారంగా అర్హులైన అభ్యర్దులకు ప్రవేశం కల్పించి యస్సీ స్టడీ సర్కిల్ బంజార హిల్స్ హైదరాబాద్ లో సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్షకు 10 నెలల పాటు ఉచిత వసతి భోజనంతో కూడిన శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అర్హులైన అభ్యర్దులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఈ సదవకాశాన్ని సద్వినియోగం పరుచుకోవాలని సూచిస్తూ కరపత్రాన్ని ఆవిష్కరించారు..ఈ ఆవిష్కరణ కార్యక్రమంలోతెలంగాణ యస్సీ స్టడీ సర్కిల్ ఉమ్మడి వరంగల్ జిల్లా శాఖ సంచాలకులు డాక్టర్.కె. జగన్ మోహన్, వెంకటేశ్వర్లు, సందేల కార్నెల్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.