ఉజ్వల భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు.
-మాదక ద్రవ్యాలపైన అవగాహన సదస్సు.
లోకల్ గైడ్/బంట్వారం:
విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఎస్సై విమల తెలిపారు. మారకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాణ్ణి పురస్కరించుకొని విద్యార్థులకు మత్తు పదార్థాల పైన అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ... విద్యార్థులు డ్రగ్స్ ,మత్తు పదార్థాలకు అలవాటు పడి బంగారు భవిష్యత్తు పాడు చేసుకోవద్దని తెలిపారు.విద్యార్థులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మాదక ద్రవ్యాల వినియోగం వల్ల, వాటి దుష్ప్రభావాలు పట్ల అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాల వినియోగం యువత ఎదుగుదలకు గొడ్డలి పెట్టి లాంటిదని తెలిపారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి, ఎవరైనా విక్రయించిన, రవాణా చేసిన సమాచారం తెలియజేయాలని తెలిపారు.ఉన్నత లక్ష్యాలు ఎంచుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ఉపాధ్యాయులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.