మత్తు మానవ జీవితాన్ని చిత్తు చేస్తుంది - సబ్ ఇన్స్పెక్టర్ జయరాజ్ *
మాదక ద్రవ్యాల వినియోగం-సరఫరా అతి ప్రమాదకరమైంది - ఎంఈఓ శంకర్ రాథోడ్
పదార్థాల వినియోగంపై అవగాహన కల్పిస్తున్నాం - ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారిని కవిత *
రాజేంద్రనగర్, ( లోకల్ గైడ్ ) : మత్తు అనేది మానవ జీవితాలను చిత్తు చేస్తుందని, మాదక ద్రవ్యాల వినియోగం సరఫరా ప్రమాదకరమే కాకుండా చట్ట వ్యతిరేక చర్యలని అత్తాపూర్ సబ్ ఇన్స్పెక్టర్ జయరాజ్ అన్నారు. " అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవం " సందర్భంగా శివరాంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రాజేంద్రనగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఐసిడిఎస్ శైరిలింగంపల్లి ప్రాజెక్టు అధికారిని కవిత ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనాటి యువతరాన్ని మత్తు (డ్రగ్స్, కోకైనా, గంజాయి ) పట్టిపీడిస్తుందన్నారు. కొందరు అక్రమ మార్గంలో సంపాదించాలనే దురాశతో డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలను విద్యార్థులకు ఏదో రూపకంగా చేరవేస్తూన్నారన్నారు. అదేవిధంగా ఎంఈఓ శంకర్ రాథోడ్ మాట్లాడుతూ... విద్యార్థులు ఎవరు కూడా మత్తు పదార్థాలకు లోను కాకూడదని, అది తమ బంగారు భవిష్యత్తు నాశనం చేస్తుందని తెలిపారు. ఎవరైనా తమ విద్యాసంస్థల వద్దకు వచ్చి చాక్లెట్లు ఇతర తినుబండారాల మాదిరిగా ఇస్తే ఎవరు తీసుకోవద్దని సూచించారు. ఎవరైనా అనుమానంగా కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు గాని 1089 నెంబర్ కు సమాచారం అందించాలని సూచించారు. మత్తు పదార్థాలను సేవించే వారిలో ఆత్మహత్యలు, శారీరక సమస్యలకు గురవుతున్నారని ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారిని కవిత స్పష్టం చేశారు. మాదకద్రవ్యాల వినియోగం, వాటి వల్ల నష్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు, అదేవిధంగా అలాకాడలు ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూరంపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కిషన్, ఇతర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, సూపర్వైజర్ పద్మజ, అంగన్వాడి టీచర్లు సుమలత, వసంత, ఎం జ్యోతి, స్రవంతి, వినోద, కల్పన, ఆరోగ్యశాఖ సిబ్బంది గౌరీ, ఆశ వర్కర్లు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. రాజేంద్రనగర్ జూనియర్ కళాశాలలో నిర్వహించే కార్యక్రమంలో షీ టీం ఎస్ఐ ప్రకాష్, సూపర్వైజర్ ఉమాదేవి, లెక్చరర్లు మురళి, రామకృష్ణ, అంగన్వాడి టీచర్లు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.