నిరుపేద రైతులకు రైతు భరోసా కు పంగనామాలు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం
--------రైతుకు యాసంగి భరోసా పంగనామాలు కాంగ్రెస్
------ఎన్నికల తర్వాత భరోసా బంద్
-------ఇచ్చిన హామీలు గాలిలో దీపం
-----టిఆర్ఎస్ పార్టీ నాయకుడు షేక్ జహంగీర్
వనపర్తి లోకల్ గైడ్,
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పేరుతోన సంబరాలు చేసుకోవడం హాశాస్పదంగా ఉందని వనపర్తి టిఆర్ఎస్ పార్టీ నాయకుడు షేక్ జహంగీర్ విమర్శించారు. కేవలం స్థానిక ఎన్నికల దృష్టిలో పెట్టుకొని 9,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటికి రాష్ట్రంలో అనేక కారణాల చేత కోర్టు కేసులు. నిషేధిత జాబితా భూములు. అటవీ భూములు. హరిజన గిరిజన కులాలకు చెందిన నిరుపేద రైతులకు రైతు భరోసా కు పంగనామా పెట్టిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత యాసంగి సీజన్ రైతు భరోసా ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. గత యాసంగి పంటకు సంబంధించిన రైతు భరోసా వివరాలు రైతుల లెక్కలు ఇచ్చిన నిధులు బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. గత యాసంగి పంట రైతులకు భరోసా కింద ఇవ్వకుండా వర్షాకాలం ఖరీఫ్ పంట సీజన్ లో ముందస్తుగానే ఈ ప్రభుత్వం నిధులు విడుదల చేయడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా రైతులలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని అన్నారు. ఏమి ఉద్ధరించారని ఆయన ప్రశ్నించారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయలేక మొక్కుబడిగా రుణమాఫీ చేసి చేతులు దులుపుకున్న ఈ ప్రభుత్వం రైతు భరోసా విషయంలో కూడా 2023 నాటి నుంచి 2025 యాసంగి సీజన్ వరకు ఇచ్చిన రైతు భరోసా వివరాలు బయటపెట్టాలని ప్రజలకు బహిరంగంగా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాక ఇచ్చిన హామీలు అమలు చేయలేక ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రామా చేస్తుందని గత ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు ఇచ్చి నేటికీ అమలు చేయలేదని ఈ విషయం రాష్ట్రంలోని ప్రజలకు బాగా తెలుసని అన్నారు. 420 హామీల తో పాటు ఆరు ఉచిత గ్యారెంటీ పథకాలు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి జాబ్ క్యాలెండర్ లేక నిరుద్యోగ యువతీ యువకులు 2024 తో పాటు 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను చూసుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ కంటే ప్రతి సంవత్సరం క్యాలెండర్ వస్తుంది తప్ప జాబ్ లు రావడం లేదని ఈ విషయం కూడా నిరుద్యోగ యువత యువకులు గమనిస్తున్నారని ఆయన అన్నారు. ఏ పథకం చూసినా కూడా నిర్వీర్యంగా నిరుపయోగంగా ప్రజలకు అందుబాటులో రాలేదని కేవలం కాలక్షేపన చేస్తూ ఈ ప్రభుత్వం రాష్ట్ర ఖజానాకు గండి కొడుతూ హెలికాప్టర్ లో మంత్రులు పర్యటించిన చరిత్ర ఎక్కడ లేదని ఆయన అన్నారు. ఇష్టారాజంగా కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలు అప్పుల తీరుతున్న ప్రజలను మోసం చేస్తూ ఈ రాష్ట్రం ధనిక రాష్ట్రం అయినప్పటికీ అప్పులు ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తూ టిఆర్ఎస్ పార్టీ పైన నిందలు మోపుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని ఎక్కడ చూసినా జిల్లా సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయాల తో పాటు జిల్లా ఎస్పీ కార్యాలయాలు. మెడికల్ కళాశాలలో. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆసుపత్రులు. విద్యాపరంగా ప్రభుత్వ కళాశాలలో గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలు. పల్లె పట్టణ నిధుల పేరుతో గ్రామీణ ప్రాంతాలతో సైతం పట్టణ ప్రాంతాలు అభివృద్ధి పథంలో ముందుకు నడుస్తున్నాయని ఆయన అన్నారు. గత పది సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధి మాత్రమే కనిపిస్తుంది తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండు సంవత్సరాల కాలం సమయం వస్తున్నా కూడా శంకుస్థాపనల పేరుతో నా శఠ గోపం పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగరవేస్తుందని ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై పూర్తి వ్యతిరేకత ఉందని అన్నారు.