కేసుల సత్వర పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి 

కేసుల సత్వర పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి 


- సర్వేయర్ తేజేశ్వర్ కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకోవాలి.
- తేజేశ్వర్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి.

గద్వాల, లోకల్ గైడ్ :
జిల్లాలో కేసుల సత్వర పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరినట్లు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని గంటవీధిలో ఇటీవల హత్యకు గురైన తేజేశ్వర్ కుటుంబ సభ్యులను సీఐ, ఎస్సైలతో కలిసి పమర్శించారు. ఎమ్మెల్యే తేజేశ్వర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లా కేంద్రానికి చెందిన తేజేశ్వర్ హత్య బాధాకర మన్నారు. ఇటీవల పాతపాలెంలో ఇదే తరహాలో హత్య చేయబడిందన్నారు. ఇలాంటి కేసుల సత్వర పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్  కోర్టులే పరిష్కారం అన్నారు.  ఇటువంటి నేరాలకు పాల్పడిన నిందితులను ఆరు నెలల్లోపు శిక్షించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయడం వల్ల నిందితులకు శిక్ష పడడం వల్ల బాధితులకు న్యాయం జరిగినట్లు అవుతుందన్నారు. ఇలాంటి సంఘటనలు రాష్ట్ర ప్రభుత్వ పరువు తీసే విధంగా ఉన్నాయని, జిల్లాలో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయడమే మంచిదన్నారు. దీని ద్వారా తప్పు చేసిన వారికి త్వరగా శిక్షలు పడే అవకాశం ఉందన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. కేసును త్వరితగతిన చేదించిన పోలీసులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ సమావేశంలో జిల్లా సీనియర్ నేత గడ్డం కృష్ణారెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బాబర్, మాజీ కౌన్సిలర్స్ మురళి, కృష్ణ మాజీ వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, మాజీ  జెడ్పిటిసి రాజశేఖర్, ఆలయ కమిటీ డైరెక్టర్ వెంకటేష్, నాయకులు గోవిందు కురుమన్న, ధర్మ నాయుడు కొత్త గణేష్, షాషా జయరాములు, వీరేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Related Posts

Latest News

బీసీల అందరం కలిసికట్టుగా ఉంటే మన రాజ్యాధికారం మనమే పాలించవచ్చు బీసీల అందరం కలిసికట్టుగా ఉంటే మన రాజ్యాధికారం మనమే పాలించవచ్చు
బీసీ రాజాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సురేష్ దాస్ 
పూరిజగన్నాథున్ని దర్శించుకున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ 
మైనర్ పిల్లలను పనిలో పెట్టుకుంటే చట్ట ప్రకారం కఠినమైన చర్యలు 
ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇచ్చేందుకు "తమ్ముడు" మూవీకి సెన్సార్ నుంచి 'ఎ' సర్టిఫికెట్ తీసుకున్న ప్రొడ్యూసర్ దిల్ రాజు
అనంతపురంలో భారీ పరిశ్రమకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
గుంటూరులో పోలీసు ఏఐ హ్యాకథాన్‌కు సీఎం చంద్రబాబు ప్రారంభం
జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలసిన మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ శ్యాం బాబు...